ముంబయిలో మోడీ మైనపు ప్రతిమ

ముంబయి: గుజరాత్‌ ముఖ్యమంత్రి, భాజపా ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ మైనపు ప్రతిమను ముంబయిలో ఆ పార్టీ జాతీయ అధ్యక్షడు రాజ్‌నాథ్‌ సింగ్‌ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో నరేంద్రమోడీతో పాటు పలువురు భాజపా నేతలు పాల్గొన్నారు. ముంబయలో మహాగర్జన ర్యాలీ సందర్భంగా ఈ ప్రతిమను ఆవిష్కరించారు.