ఆవ్‌ ఢిల్లీ ప్రజలను మోసం చేస్తోంది : భాజపా

ఢిల్లీ : కాంగ్రెస్‌ మద్దతుతో ప్రభుత్వం ఏర్పాటు చేయాలని నిర్ణయించడం ద్వారా ఆమ్‌ఆద్మీ పార్టీ ఢిల్లీ ప్రజలను మోసం చేస్తోందని భాజపా నేత హర్షవర్ధన్‌ ఆరోపించారు. అధికారం కోసం మొహం వాచి ఉన్నట్లు ఆవ్‌ ప్రవర్తిస్తోందని ఆయన విమర్శించారు. అవినీతి వ్యతిరేేక ఉద్యమం పేరుతో ఎన్నికల్లో పోరాడిన ఆవ్‌, ఏ పార్టీనైతే ఢిల్లీ ప్రజలు పూర్తిగా తిరస్కరించారో ఆ పార్టీ మద్దతుతోనే ప్రభుత్వం ఏర్పాటుచేయాలనుకోవడం చూస్తే కాంగ్రెస్‌ లాగే ఆవ్‌ కూడా అధికారం కోసం అర్రులు చాస్తున్నట్లు తెలుస్తోందని హర్షవర్ధన్‌ అన్నారు.