తిరుమలలో కారు బోల్తా : ఆరుగురికి గాయాలు

తిరుమల : తిరుమల నుంచి తిరుపతికి వెళ్లే మొదటి కనుమ రహదారిలో 32వ మలుపు వద్ద భక్తులతో ప్రయాణిస్తున్న ప్రైవేటు వాహనం(కారు) లోయలో పడింది. ఈ ప్రమాదంలో బెంగళూరుకి చెందిన ఆరుగురు భక్తులకు గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం తిరుపతి రుయాకి తరలించారు.