రాహుల్‌ గాంధీకి జాట్‌ నేతల కృతఙ్ఞతలు

న్యూఢిల్లీ : కాంగ్రెస్‌ ఉపాధ్యాక్షుడు రాహుల్‌ గాంధీ జాట్‌ నేతలు కృతఙ్ఞతలు తెలిపారు. హర్యానా ముఖ్యమంత్రి భూపిందర్‌ సింగ్‌ హుడా నేతృత్వంలో పలువురు నేతలు ఈ రోజు ఢిల్లీలో రాహుల్‌ గాంధీని కలిశారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో జాట్‌లకు రిజర్వేషన్లు కల్పించాల్సిందిగా వెనకబడిన వర్గాల కమిషన్‌కు కేబినెట్‌ సూచించింది. అందుకే వారు రాహుల్‌కు కృతఙ్ఞతలు తెలపడానికి 12, తుగ్లక్‌లేన్‌లో రాహుల్‌ గాంధీ నివాసానికి వచ్చారు. ఎన్‌సీబీసీ ఇప్పుడీ విషయం పై నిర్ణయం తీసుకోనుంది.