ఆవ్ మద్దతుపై కాంగ్రెస్లో భిన్నాభిప్రాయాలున్నాయి : ద్వివేదీ
ఢిల్లీ : రాహుల్ గాంధీనే తమ పార్టీ భవిష్యత్ నాయకుడని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి జనార్దన్ ద్వివేదీ మరోసారి స్పష్టం చేశారు. పార్టీలో సోనియా తర్వాత స్థానం రాహుల్దేనన్నారు. ఆమ్ఆద్మీ పార్టీకి మద్దతుపై కాంగ్రెస్లో భిన్నాభిప్రాయాలున్నాయన్న ద్వివేది, ఈ పార్టీకి ప్రతిపక్షంలో కూర్చుని ప్రజా సమస్యలు లేవనెత్తాలని ప్రజలు తీర్పునిచ్చారని పేర్కొన్నారు.