రోడ్డు ప్రమాదంలో ఇద్దరి మృతి

మైదుకూరు రూరల్‌ : కడపజిల్లా మైదుకూరు- పోరుమామిళ్ల రహాదారిపై వనిపెంట సమీపంలో ఈ తెల్లవారుజామున గుర్తు తెలియని వాహనం ఢీకొని ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు స్థానిక టమోటా వ్యాపారుల వద్ద గుమాస్తాలుగా పని చేస్తున్న విజయవాడకు చెందిన నారాయణ, నర్సింహరాజులుగా గుర్తించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలాన్ని జీఐ వెంకటశివారెడ్డి పరిశీలించారు.