ఆరేళ్ల బాలికపై టీనేజి బాలుడి అత్యాచారం

రామనాథపురం : తమిళనాడులోని రామనాథపురంలో ఒక టీనేజి బాలుడు ఆరేళ్ల బాలికను చాకెట్‌ ఆశ చూపి నిర్జన ప్రదేశానికి తీసుకెళ్లి అత్యాచారం చేశారు. బాలికకు విపరీతంగా రక్తస్రావం కావడంతో తల్లిదండ్రులు ఆస్పత్రిలో చేర్పించారు. బాలిక వైద్యులకు విషయం చెప్పడంతో నిన్న జరిగిన ఈ సంఘటన బుధవారం వెలుగులోకి వచ్చింది. వెంటనే స్థానికులు బాలుడిని పట్టుకుని తీవ్రంగా కొట్టారు. పోలీసులు జోక్యం చేసుకుని అతడిని ఆస్పత్రిలో చేర్చారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.