ఆడపిల్ల పుట్టిందని వ్యక్తి ఆత్మహత్య

కంచికచర్ల, కృష్ణా : ఆడపిల్ల పుట్టిందని మనస్తాపం చెంది ఓ వ్యక్తి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన కంచికచర్లలో చోటు చేసుకుంది. మండలంలోని పరిటాలకు చెందిన సద్దాం హుస్సేన్‌(26) దంపతులకు రెండు నెలల క్రితం ఆడపిల్ల పుట్టింది. రెండో సంతానమూ ఆడపిల్ల కావడంతో మనస్తాపం చెందిన హుస్సేన్‌ నవంబర్‌లో రండు సార్లు ఆత్మహత్యాయత్నం చేశాడు. ఈ తెల్లవారుజామున కంచికచర్ల సమీపంలోన పంటపొలాల్లో చెట్లకు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై దుర్గా ప్రసాద్‌ తెలిపారు.