శనివారం కొలువుతీరనున్న ఢిల్లీ ప్రభుత్వం

ఢిల్లీ : ఢిల్లీ కొత్త ముఖ్యమంత్రిగా అరవింద్‌ కేజ్రీవాల్‌ శనివారం మధ్యాహ్నం 12 గంటలకు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రామ్‌లీలా మైదానంలో జరిగే ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రితో పాటు ఆరుగురు మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేస్తారు. ప్రమాణ స్వీకారం తేదీ ఖరారు కాగానే అన్నా హజారేని ఆహ్వానిస్తామని అరవింద్‌ కేజ్రీవాల్‌ ఇంతకు ముందే స్పష్టం చేశారు. అన్నా, కిరణ్‌బేడీ, సంతోష్‌ హెగ్డే తదితరులను ఈ కార్యక్రమానికి ఆహ్వానించనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. పిన్నవయస్కులైన మంత్రి వర్గ సహచరులతో ఢిల్లీకి పిన్న వయసు ముఖ్యమంత్రిగా అరవింద్‌ కుజ్రీవాల్‌ చరిత్ర సృష్టించనున్నారు. వీఐపీ సంస్కృతికి వ్యతిరేకంగా ఇప్పటికే ఆవ్‌ తీసుకున్న నిర్ణయాలు చర్చనీయాంశాలయ్యాయి. కాంగ్రెస్‌ మద్దతు గురించి జరుగుతున్న వూగిసలాట విషచమై అరవింద్‌ కేజ్రీవాల్‌ ఈ రోజు ఉదయం జనతా దర్బారులో మాట్లాడుతూ తాము సమస్యల మీద దృష్టి పెడుతున్నామని, మద్దతు మీద కాదని పేర్కొన్నారు.