ముగిసిన ఉత్తరాఖండ్‌ అడ్వెంచర్‌ కార్‌ ర్యాలీ

డెహ్రాడూన్‌ : ఉత్తరాఖాండ్‌లో నాలుగురోజుల పాటు జరిగిన అడ్వెంచర్‌ కార్‌ ర్యాలీ ముగిసింది. టీమ్‌ మారుతి తరఫున పాల్గొన్న జగ్మీత్‌ గిల్‌, చందన్‌ దాన్‌లు ఈ ర్యాలీ విజేతలుగా నిలిచారు. బెంగళూరుకు చెందిన దంపతులు సతీశ్‌ గోపాలకృష్ణన్‌, సవేరా డిసౌజాలు రెండో స్ధానంలో నిలిచారు. హాల్దియాకు చెందిన అజ్గర్‌ అలీ, తమిళనాడుకు చెందిన ముస్తఫాలు మూడో స్థానం సాధించారు. విజేతలకు వరుసగా రూ.5, 3, 2 లక్షల చొప్పున నగదు బహుమతిని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి విజయ్‌ బహుగుణ అందజేశారు. ర్చాలీలో పాల్గొన్న మహిళల జట్టుకు కూడా సీఎం లక్షరూపాయల ప్రోత్సాహక బహుమతి అందజేశారు. పర్యావరణ హిత టూరిజాన్ని ప్రోత్సహించే ఉద్దేశంతో ఉత్తరాఖండ్‌ రాష్ట్ర పర్యాటక శాఖ ఈ ర్యాలీని నిర్వహిస్తోంది.