వాజ్పేయికి ప్రముఖుల శుభాకాంక్షల వెల్లువ
ఢిల్లీ :మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయికి ఈ రోజు పలువురు ప్రముఖులు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అందరికన్నా ముందుగా ప్రధాని మన్మోహన్ సింగ్ మధ్యాహ్నం 12.30 గంటలకు వాజ్పేయి నివాసానికి వెళ్లి 89వ జన్మదిన
శుభాకాంక్షలు తెలిపారు. 20 నిమిషాల పాటు ప్రధాని వాజ్పేయితో గడిపారు. ఆ తర్వాత భాజపా అగ్రనేత అధ్వానీ వాజ్పేయి నివాసానికి వచ్చి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. భాజపా ప్రధాని అభ్యర్థి నరుఏంద్ర మోడీతో సహా ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు, పలువురు ఇతర నేతలు, కార్యకర్తలు, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు వాజ్పేయికి శుభాకాంక్షలు తెలిపారు. కొంతకాలంగా అనారోగ్యంగా ఉన్న వాజ్పేయి అధికారిక నివాసంలోనే ఉంటున్నారు.