పార్లమెంట్‌ హౌస్‌ నేపథ్యంగా రాంచీలో మోడీ వేదిక

జార్ఖండ్‌ : ఈ రోజు రాంచీలో జరగనున్న భాజపా ప్రధాని అభ్యర్థి నరేంద్రమోడీ సభకు భారీగా ఏర్పాట్లు చేశారు. పార్లమెంటు హౌస్‌ నేపథ్యంతో వేదిక రూపొందించారు. మెత్తం మూడు వేదికలు సిద్ధం చేశామని, ఒక వేదిక పై నుంచి మోడీ ప్రసంగిస్తారని, మిగిలిన రెండు వేదికలు నేతలు కూర్చోవడానికి ఉపయోగిస్తామని జార్ఖండ్‌ భాజపా అధ్యక్షులు రవీంద్రరాయ్‌ తెలిపారు. సభకు 2500 మంది పోలీసులతో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. వేదికకు 65 అడుగుల దూరం నుంచి బ్యారికేడ్లు నిర్మించినట్లు భద్రతాధికారులు తెలిపారు. సభాప్రాంగణానికి ఏర్పాటు చేసిన 40 గేట్ల మెటల్‌ డిటెక్టర్లను ఏర్పాటు చేశారు.