కానిస్టేబుల్‌ పై మద్యం మాఫియా దాడి

ఢిల్లీ : విధినిర్వహణలో భాగంగా గిటోర్ని అటవీ ప్రదేశంలో తనిఖీలు చేస్తున్న పోలీసులపై మద్యం మాఫియాకు చెందిన వ్యక్తులు దాడి చేశారు. ఈ దాడిలో ఒక పోలీస్‌ కానిస్టేబుల్‌ తీవ్రంగా గాయపడ్డారు. మరికొందరు సిబ్బంది కూడా గాయపడినట్లు సమాచారం. గాయపడిన సిబ్బంది పోలీస్‌ శాఖకు చెందిన వారని, ఎక్సైజ్‌ శాఖలో డిప్యూటేషన్‌ మీద పనిచేస్తున్నారని తెలుస్తోంది.