సోమవారం సాయంత్రం ఫరూక్ షేక్ అంత్యక్రియలు
ముంబయి : గుండెపోటుతో శుక్రవారం రాత్రి దుబాయ్లో కన్నుమూసి బహుముఖ ప్రఙ్ఞాశాలి, సినీనటుడు ఫరూఖ్ షేక్ అంత్యక్రియలు సోమవారం సాయంత్రం ముంబయిలో జరుగుతాయి. దుబాయ్ నుంచి ఆయన పార్థివదేహం ముంబయి చేరుకునేసరికి సాయంత్రం 4 గంటలు అవుతుందని, 7గంటలకు అంత్యక్రియలు నిర్వహిస్తారని ఫరూక్ కుటుంబ సన్నిహిత మిత్రుడు సతీష్ షా తెలిపారు. ఉమ్రాప్ జాస్ , చష్మెబద్దూర్, సాథ్ సాథ్ లాంటి చిత్రాలతో ఎందరో అభిమానులను సంపాదించుకున్న ఫరూఖ్ షేక్కి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.