మీడియాపై ఢిల్లీ సెక్రటేరియట్ లో ఆంక్షలు
ఢిల్లీ : ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం ఏర్పడి రెండు రోజులే అయింది. అప్పుడే వివాదాలు చుట్టుముడుతున్నాయి. ఢిల్లీ ప్రభుత్వం సచివాలయంలోకి మీడియాను అనుమతించకపోవడంతో సోమవారం నిరసన వ్యక్తమైంది. మీడియా సెంటర్ వరకు మాత్రమే విలేకరులు వెళ్లవచ్చని, మంత్రుల గదుల వద్దకు వెళ్లడానికి వీల్లేదని పేర్కొనడంతో మీడియా ఆవ్ ప్రభుత్వ కార్యక్రమాన్ని బహిష్కరించింది. ఈ విషయం పై ఆరోగ్య శాఖ మంత్రి సత్యేంద్ర జైన్ను ప్రశ్నించగా ఏం జరిగిందో తెలుసుకుంటానని చెప్పి ఆయన విలేపకరుల సమావేశం నుంచి వెళ్లిపోయినట్లు సమాచారం. సెక్రెటేరియట్లోకి ప్రజలెవరైనా ఎలాంటి పాసులు అవసరం లేకుండా వెళ్లవచ్చని గతంలో ఆవ్ ప్రకటించింది.