కష్టాల్లో భారత్‌ జట్టు

డర్బన్‌ : డర్బన్‌ జరుగుతున్న రెండో టెస్ట్‌ మ్యాచ్‌లో భారత్‌ కష్టాల్లో పడింది. ఓవర్‌ నైట్‌ స్కోర్‌ 68/2తో బరిలోకి దిగిన భారత్‌ను కోహ్లీ(11), పుజారా(32)లు గట్టెక్కించలేకపోయారు. అజింక్య రహానే(50) ఆదుకునే ప్రయత్నం చేసినప్పటికీ వెంటవెంటనే రోహిత్‌ శర్మ (25),ధోని(15)ల వికెట్లు కోల్పోవడంతో భారత్‌ పీకల్లోతు కష్టాల్లో పడింది. భోజన విరామ సమయానికి భారత్‌ 173/7 పరుగులతో ఆడుతోంది. ప్రస్తుతం భారత్‌కు 7 పరుగుల ఆధిక్యం లభించింది. చేతిలో మరో మూడు వికెట్లున్నాయి.