వివాదాస్పదమైన యూపీ మంత్రి చర్య

వారణసి : ఉత్తరప్రదేశ్‌ లో అధికారులే కాదు,మంత్రులూ తరచూ వార్తలకెక్కుతూనే ఉన్నారు. తాజాగా సురేందర్‌ సింగ్‌ పటేల్‌ అనే మంత్రి వంతు వచ్చింది. ఆదివారం రోహనియా గ్రామంలో ప్రభుత్వం తరఫున దుప్పట్ల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ఆ కార్యక్రమం సందర్భంగా మంత్రి ఓ వ్యక్తి చెంప ఛెళ్లుమనిపించినట్లుగా కెమెరా కంట చిక్కింది. దుప్పట్లు తతీసుకోవడానికి వచ్చిన పేదవారిపై మంత్రి చేయిచేసుకున్నారని అర్థం వచ్చేలా మీడియాలో కథనాలు ప్రసారం కావడంతో ఆయన సోమవారం వివరణ ఇచ్చారు. తాను ఎవరిపై చేయి చేసుకోలేదని, ఆ వ్యక్తి ఎవరో కాదు తన మేనల్లుడేనని, దుప్పట్లు తీసుకురావాల్సిందిగా అతడికి సూచించానని మంత్రి చెప్పారు. పటేల్‌ అఖిలేష్‌ మంత్రి వర్గంలో ప్రజాపనుల శాఖ మంత్రిగా పనిచేస్తున్నారు.