సాగర్‌ సందర్శించిన మధ్యప్రదేశ్‌ మంత్రి

గుంటూరు, విజయపురి సౌత్‌ : మధ్యప్రదేశ్‌ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత హోంశాఖ మంత్రి బాబు లాల్‌ గౌర్‌ సోమవారం సాగర్‌ డ్యాం, నాగార్జున కొండ కుటుంబసమేతంగా సందర్శించారు. మ్యూజియంలోని పురాతన అవశేషాలను, శిలాఫలకాలను, రాతి పనిముట్లను, బంగారు భరిణిలో దాచి ఉంచిన బుద్ధ ధాతువు (ఎముక)ను, సన్నటి గొలుసులను పరిశీలించారు. బుద్ధదేవుని ఏడు అడుగుల పాలరాతి విగ్రహాన్ని ఆసిక్తిగా తిలకించారు. బుద్ధుని కాలం నాటి రాతి పనిముల్లు, లోహపు పాత్రలను నాగార్జున కొండపై పునర్‌ నిర్మించిన స్నాన ఘట్టం, బుద్ధ దేవుని విగ్రహం, స్తూపాలను ఆయన తిలకించారు.