సమాజ్‌ వాదీ పార్టీ ఎమ్మెల్యే సయ్యద్‌ ఖాసీమ్‌ మృతి

ఫతేపూర్‌ : ఉత్తరప్రదేశ్‌ లోని సర్దార్‌ నియోజక వర్గం సమాజ్‌వాది పార్టీ ఎమ్మెల్యే సయ్యద్‌ ఖాసీమ్‌(47) మృతి చెందారు. సోమవారం సాయంత్రం ఛాతీలో నొప్పి రావడంతో జిల్లా ఆసుపత్రికి తరలించారు. అనంతరం కాన్పూర్‌లోని ఆసుపత్రికి తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ ఖాసీమ్‌ మృతి చెందినట్లు ఆయన కుటుంబసభ్యులు తెలిపారు. ఖాసీమ్‌ నాలుగు పర్యాయాలు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆయన భార్య జహన్నాబాద్‌ నగర్‌ పంచాయతీ ఛైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. ఎమ్మెల్యే మృతతి పట్ల ముఖ్యమంత్రి అఖిలేశ్‌ యాదవ్‌ సంతాపం తెలిపారు.