ప్రధానమంత్రికి జయలలిత లేఖ

చెన్నై : తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు లేఖ రాశారు. తమిళ మత్స్యకారులపై శ్రీలంక పైన్యం దాడులు, అక్రమ అరెస్టులను ఖండిస్తూ ఆమె లేఖ రాశారు. దాడులకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని లేఖలో ప్రధానిని కోరారు. దాడులకు పాల్పడిన లంక సైన్యం పై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని కేంద్రం విఫలమైందని జయలలిత విమర్శించారు.