ముంబయిలో రాత్రంతా పార్టీ చేసుకోవచ్చు

ముంబయి : కొత్త సంవత్సరం వేడుకలు నిర్వహించుకోవడానికి రాత్రంతా హోటళ్లను తెరచి ఉంచేందుకు బోంబే హైకోర్టు అనుమతి ఇచ్చింది. దీంతో ఈ రోజు రాత్రి హోటళ్లు, రెస్టారెంట్లు తెల్లవారుజామున 5గంటల వరకు తెరచి ఉంచవచ్చు. కొత్త సంవత్సరాన్ని పురస్కరించుకుని ప్రజలు రాత్రి పూటే బంధు మిత్రులతో గడపాలనుకుంటారు కాబట్టి హోటళ్లను అర్ధరాత్రికే మూసేయమనడం సబబు కాదని న్యాయస్థానం పేర్కొంది.