కేజ్రీవాల్‌కు విశ్రాంతి అవసరమన్న వైద్యులు

ఢిల్లీ : ఢిల్లీ కొత్త ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌కు స్వరం తగ్గలేదు. ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసినప్పటి నుంచి జ్వరంతో బాధ పడుతున్న ఆయన అలాగే ఇంట వద్ద అధికారిక సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇవాళ గంటలపాటు కార్యాలయానికి వెళ్లాలనుకున్న కేజ్రీవాల్‌కు వైద్యులు అభ్యంతరం చెప్పారు. ఆయనకు రెండు రోజులు పూర్తిగా విశ్రాంతి అవసరమని వారు పేర్కొన్నారు. కేజ్రీవాల్‌ కొంత కాలంగా ఎక్కువ ఉపవాసాలు చేశారని అందుకే చాలా నీరసించారని, ఆయన ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారని వైద్యులు పేర్కొన్నారు.