ప్రధాని రాజీనామా వార్తలను తోసిపుచ్చిన మనీష్ తివారీ
న్యూఢిల్లీ : ప్రధాని మన్మోహన్ సింగ్ శుక్రవారం రాజీనామా చేస్తారని, రాహుల్ గాంధీకి చోటు కల్పిస్తూ ఆయన పదవి నుంచి తప్పుకొంటారని కొన్ని ఛానల్స్లో వచ్చిన వార్తలను కేంద్రమంత్రి మనీష్ తివారీ కొట్టివేశారు. అవన్నీ నిరాధారాలు, వూహాగానాలేనని ఆయన పేర్కొన్నారు. ప్రధాని తమతో ఎక్కవ మాట్లాడరని మీడియాకు కినుక అని, కొత్త సంవత్సరం సందర్భంగా మాట్లాడదామని ప్రధాని శుక్రవారం విలేకరుల సమావేశం నిర్వహించబోతోంటే మరో పక్క మీడియా ఈ వూహాగానాలను ప్రచారం చేస్తోందని మనీష్ తివారీ ఆరోపించారు.