బస్సు లోయలో పడి ఐదుగురు మృతి

ధానె: బస్సు లోయలోకి దూసుకెళ్ళి ఐదుగురు మృతి చెందిన సంఘటన మహారాష్ట్రలోని ధానె జిల్లాలో చోటు చేసుకుంది. గురువారం ఉదయం టోక్వాండే వద్ద ప్రమాదానికి గురైన ఈ బస్సు అహ్మద్‌నగర్‌ వెళ్తోంద, బస్సులో 40 మంది ప్రయాణీకులు ఉన్నారని, సహాయ చర్యలు కొనసాడుతున్నాయని అధికారులు తెలిపారు. బస్సు మలుపు తిప్పుతున్నప్పుడు అదుపు తప్పి ప్రమాదం సంభవించినట్లు ప్రత్యక్ష సాక్షులు పేర్కొంటున్నారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని వారు తెలిపారు.