కొత్తబట్టలు కొనివ్వలేదని విద్యార్థి ఆత్మహత్య

గోనెగండ్ల, కర్నూలు: నూతన సంవత్సర వేడుకలకు కొత్తబట్టలు కొనివ్వలేదని ఓ విద్యార్జి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. బంధువులు తెలిపిన వివరాల ప్రకారం గోనెగండ్ల గ్రామానికి చెందిన రంగన్న , సావిత్రి దంపతులకు ఏకైక కుమారుడు కృష్ణ (14) నూతన సంవత్సర వేడుకలకు తన మిత్రులందరూ నూతన దుస్తులు కొనుక్కుంటున్నారని, తనకు కావాలని ఇంట్లో పట్టుబడ్డాడు. సేద్యం పనుల వలన అప్పులున్నాయని బట్టలు కొనివ్వడం సాధ్యంకాదని తండ్రి రంగన్న తెలిపాడు. దీంతో మనస్తాపానికి గురైన కృష్ణ గురువారం పురుగుల మందు తాగి పాఠశాలకు బయలు దేరాడు. తోటి విద్యార్థులు తెలుసుకుని స్థానిక ఆసుపత్రికి తరలించారు. అప్పటికే పరిస్థితి విషమించడంతో ఆసుపత్రి లో చికిత్స పొందుతూ కృష్ణ మృతి చెందాడు.