మెట్రోలో వెళ్లడం గొప్ప కాదు : హర్షవర్ధన్‌

ఢిల్లీ : 15 ఏళ్లు ఢిల్లీని పాలించిన కాంగ్రెస్‌ పార్టీని ప్రజలు నిరాదరిస్తే ఆ పార్టీ మద్దతుతో ఆమ్‌ ఆద్మీ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడాన్ని భాజపా నేత హర్షవర్ధన్‌ విమర్షించారు.ఢిల్లీ రాష్ట్ర శాసనసభలో ప్రభుత్వ విశ్వాసతీర్మానంపై చర్చలో మాట్లాడుతూ ఆయన ఆమ్‌ ఆద్మీ పార్టీ నేతలు మొట్రో రైళ్లలో ప్రయాణిస్తూ చౌకబారు ప్రచారం చేసుకుంటున్నారన్నారు. కేజ్రీవాల్‌, సిసోడియాలు ఢిల్లీ ప్రజలను తప్పదోవ పట్టిస్తున్నారని, మెట్రోల్లో వెళ్లడం గొప్ప విషయం కాదని, తాము కూడా ప్రయాణించగలమని ఆయన అన్నారు. మెట్రోల్లో ప్రయాణించడం ద్వారా భద్రత సమస్యలు సృష్టించడమే కాక, మెట్రో నియమాలను ఉల్లంఘిస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు.