వూటీ పరిసరాల్లో చిరుత సంచారంపై ఆందోళన

తమిళనాడు: కలప కోసం అడవికి వెళ్లి అదృశ్యమైన వ్యక్తి చిరుతపులి బారినపడినట్లు తెలియడంతో వూటీ చుట్టుపక్కల ప్రాంత ప్రజలు ఆందోళన చెందుతున్నారు. వూటీ సమీపంలోని అట్టాబెట్టు అనే ప్రాంతంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. గతవారమే ఒక మహిళ కూడా ఇలా చిరుత బారిన పడి మృతి చెందింది. చిరుత తిని వదిలేసిన వ్యక్తి శరీరాన్ని అటవీ శాఖ అధికారులు ఈ రోజు గుర్తించారు. చుట్టుపక్కల చిరుత సంచరించిన ఆనవాళ్లు కన్పించడంతో నీలగిరి జిల్లా ప్రజలు ఆందోళన చెందుతున్నారు. అటవీ అధికారులు చిరుతను పట్టుకోవడానికి నాలుగు పంజరాలను ఏర్పాటు చేసినా ఫలితం లేకపోయింది.