ఐపీఎల్ ఫిక్సింగ్ పై బీసీసీఐ దర్యాప్తు

 (జ‌నంసాక్షి): ప్రపంచ క్రికెట్ కు మచ్చతెచ్చిన  ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్, బెట్టింగ్ స్కాండల్ పై బీసీసీఐ దర్యాప్తు ప్రారంభించింది. బెట్టింగ్, ఫిక్సింగ్ పై జస్టిస్ ముకుల్ ముద్గల్ కమిటీకి టీమిండియా కెప్టెన్ ఎంఎస్ ధోనీ, శ్రీనివాసన్ తోపాటు  ఐపీఎల్ సీఓఓ సుందర్ రమణ్ ఇచ్చిన వాంగ్మూల రికార్డులను పరిశీలించేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఐతే బిసీసీఐ దాఖలు చేసిన పిటిషన్ ను సుప్రీం శుక్రవారం  విచారణకు చేపట్టనుంది.