కేరళలో 8నెలల్లో వందకిలోల బంగారం పట్టివేత

తిరువనంతపురం: కేరళ రాష్ట్రంలో గత ఎనిమిది నెలల్లో 100 కిలోల బంగారం అక్రమ రవాణాపై అవుతూ పట్టుబడిందని అధికారులు తెలిపారు. బంగారం అక్రమ రవాణాపై దాదాపు 60 కేసులు నమోదయ్యాయి.ప్రభుత్వం బంగారం మీద కస్టమ్స్‌ డ్యూటీ పెంచడం వల్లనే అక్రమ రవాణా ఎక్కువయిందని కోచి కస్టమ్స్‌ యూనిట్‌ కమిషనర్‌ రాఘవన్‌ పేర్కొన్నారు.