తుపాన్‌ ప్రభావిత ప్రాంతాల్లో ప్రధాని పర్యటన

1    తక్షిణ సాయంగా వెయ్యి కోట్లు

మృతుల కుటుంబాలకు రెండు లక్షలు

క్షతగాత్రులకు యాభై వేలు

ఆంద్రాను ఆదుకుంటాం : ప్రధాని నరేంద్ర మోడీ

విశాఖపట్నం,అక్టోబర్‌14(జనంసాక్షి): తుఫాను ఈ ప్రాంతాన్ని అతలాకుతలం చేసిందని, ఈ ఆపద సమయంలో అన్ని విధాలా తాము ఆదుకుంటామని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. విశాఖపట్నంలోని తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన అనంతరం ఆయన విూడియాతో మాట్లాడారు.  తక్షణ సాయంగా వేయికోట్ల సాయం ప్రకటించారు. మృతి చెందిన వారికి ప్రధాని సహాయనిధి నుంచి 2లక్షలు, క్షతగాత్రులకు 50వేల సహాయాన్ని ప్రకటించారు. తుపాను బాధిత ప్రాంతాల్లో సహాయ పునరావాస చర్యలకు గాను తక్షణ సాయం కింద ప్రధాని నరేంద్రమోదీ ఆంధప్రదేశ్‌కు రూ. వెయ్యికోట్లు ఆర్థికసాయం ప్రకటించారు. ఆయన విూడియాతో మాట్లాడుతూ సాధారణ పరిస్థితులు నెలకొనే వరకూ విశాఖ వాసులకు అండగా ఉంటానని హావిూ ఇచ్చారు. విశాఖ వాసులకు అండగా ఉంటానని ప్రధాని నరేంద్రమోదీ పేర్కొన్నారు. విశాఖలో ఆయన వరద ప్రభావంతో నష్టపోయిన ప్రాంతాలను సందర్శించిన అనంతరం విూడియాతో మాట్లాడుతూ పెనుతుపానును ధైర్యంగా విశాఖ వాసులను అభినందించారు. కొద్ది రోజుల్లోనే పరిస్థితి సాధారణ స్థితికి వస్తుందని ఆయన ఆకాంక్షించారు. తుఫాను గమనాన్ని గుర్తించేందుకు టెక్నాలజీని బాగా ఉపయోగించుకున్నారు. ఆరోతేదీ నుంచి ఈ సంకేతాలిచ్చారు. ముందుగా అనుకున్న స్థాయి, దిశ, సమయం అన్నీ సరిగ్గా సరిపోయాయి. ఒకరకంగా ఈ ఆపద నుంచి తప్పించుకోవడంలో టెక్నాలజీ బాగా ఉపయోగపడింది. కేంద్రం, రాష్ట్రం రెండూ సమన్వయంతో పనిచేసి, సరైన దిశలో పనిచేస్తే ఎంత పెద్ద ఆపద అయినా.. దాన్నుంచి బయటపడొచ్చని అన్నారు.  ఆంధ్రా ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం నిమిష నిమిషానికీ అద్భుతమైన సమన్వయంతో పనిచేశాయి. స్థానిక ప్రభుత్వాలు కూడా వాటిని అమలుచేశాయి. ఇందుకు విశాఖ ప్రజలను అభినందిస్తున్నాను. ఈ ఆపద సమయంలో ప్రభుత్వం చెప్పినట్లే చేశారు. క్రమశిక్షణ కారణంగా ప్రజల ప్రాణాలు కాపాడటంలో మేం విజయం సాధించగలిగాం అని అన్నారు.  తుఫాను భీకరమైనది. దీన్ని విూరంతా స్వయంగా అనుభవించారు. విూరు చూపించిన ధైర్యానికి సెల్యూట్‌. నేను దారిలో ఇబ్బందులన్నీ గమనించాను. ఒడిషాలో కూడా చూశాను. ఈ ఆపద సమయంలో కేంద్రం విూ అందరికీ వెన్నంటి ఉంటుంది. కోస్ట్‌గార్డ్‌,నేవీ, రైల్వే, ఎయిర్లైన్స్‌, జాతీయ రహదారులు.. అన్నింటికీ ఎంత నష్టం వచ్చినా కేంద్రం నుంచి పూర్తి సాయం అందిస్తాం. పూర్తి సర్వే చేయిస్తున్నాం. వ్యవసాయ సర్వే, ఆస్తుల సర్వే కూడా చేయిస్తాం. ఎక్కడెక్కడ ఎంత నష్టం వాటిల్లిందో చూస్తాం. ప్రైవేటు బీమా కంపెనీలతో మాట్లాడి, సానుభూతి దృష్టితో పరిహారం ఇప్పించాల్సిందిగా చెబుతాం. ఆంధప్రదేశ్‌కు చాలా పెద్ద ఆపద వచ్చింది. విశాఖపట్నాన్ని స్మార్ట్‌ సిటీగా చేద్దామని ఇంతకుముందే అనుకున్నాం. అంతలోనే ఈ ఆపద వచ్చింది. అయినా.. వెనకడుగు వేసేది లేదు. విద్యుత్‌, మంచినీళ్లు, కమ్యూనికేషన్లను ముందుగా పునరుద్ధరిస్తాం. కొంచెం సర్వే ఇంకా చేయాల్సి ఉంది. అయినా.. ఈ ఘోర విపత్తు సమయంలో ముందుగా వెయ్యికోట్ల రూపాయల తక్షణ సాయం ఇస్తున్నాం. భవిష్యత్తులో కూడా మరింత సాయం చేస్తాం. మృతులు, క్షతగాత్రులకు కూడా ప్రధానమంత్రి సహాయ నిధి నుంచి సాయం అందిస్తాం అని ప్రధాని నరేంద్రమోదీ చెప్పారు. విభజన సమయంలో పునర్నిర్మాణంలో ఉన్నప్పటికీ ముందుకు సాగుదామని భరోసా ఇచ్చారు.