8,9తేదీల్లో సార్వత్రిక సమ్మె

విజయనగరం,డిసెంబర్‌17(జ‌నంసాక్షి): కార్మికుల హక్కుల కోసం పోరాటం చేయాల్సిన అవసరముందని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి టి.వి.రమణ పిలుపునిచ్చారు. జనవరి 8, 9 తేదీల్లో నిర్వహించే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో పాల్గొనాలని కార్మికులకు పిలుపునిచ్చారు.  పాలకులు కార్పొరేట్‌ కంపెనీల సంక్షేమానికే ప్రాధాన్యత ఇస్తున్నారని విమర్శించారు. ప్రభుత్వ రంగ సంస్థలను పూర్తిగా ప్రైవేటీకరణ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కార్మికులకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, మూతపడిన పరిశ్రమలను తెరిపించాలని, మహళా కార్మికులకు రెండు నెలలు ప్రసూతి సెలవులు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.