రాత్రికి రాత్రే అనర్హులకు రేషన్‌ షాపుల కేటాయింపు

రేషన్ డీలర్ల నియామకల్లో అవకతవకలు జరిగాయని, అర్హులకే ఇవ్వాలని డిమాండ్ చేస్తూ 10 మంది అభ్యర్థులు సిరిసిల్ల పట్టణంలోని వాటర్ ట్యాంక్ఎక్కి పెట్రోల్‌ బాటిల్స్‌తో ఆందోళన చేపట్టారు. రాత్రికి రాత్రే అనర్హులకు రేషన్ షాపులు కేటాయించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పది సంత్సరాల పైగా రేషన్ షాపులు నిర్వహిస్తే ఉన్న పళంగా రద్దు చేసి మా కుటుంబాలు రోడ్డున పడేశారని అవేదన వ్యక్తం చేశారు.పాత వారికే రేషన్ డీలర్‌ షిప్‌లు కేటాయించాలని డిమాండ్ చేశారు. కలెక్టర్ స్పందించి మొన్న కేటాయించిన షాపులను రద్దు చేసి తిరిగి ఇవ్వాలన్నారు. సమాచారం అందుకున్న అడిషనల్ ఎస్పీ చంద్రయ్య, డీఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి సిబ్బందితో కలిసి సంఘటన స్థలానికి చేరుకొని బాధితులతో మాట్లాడారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.