తెలంగాణ ఉద్యోగులపై కాంగ్రెస్ సర్కార్ చిన్నచూపు

రైతులకు, కౌలురైతులకు ఇద్దరికీ రైతుభరోసా ఇస్తామంటూ ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌ పార్టీ ఇచ్చిన హామీ ఒట్టిదేనని తేలిపోయింది. ఇద్దరికీ ఇవ్వడం కుదరదని, ఎవరో ఒకరికి మాత్రమే రైతుభరోసా ఇస్తామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కుండబద్దలు కొట్టిన విషయం తెలిసిందే.ఈ వ్యవహారంపై బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఎక్స్‌ వేదికగా స్పందించారు. రైతులను మోసం చేస్తున్న కాంగ్రెస్‌ సర్కార్‌పై కేటీఆర్‌ నిప్పులు చెరిగారు. ఓడ దాటేదాక ఓడ మల్లన్న, ఓడ దాటకా బోడి మల్లన్న అన్నటుంది కాంగ్రెస్‌ పాలనా అని తీవ్రంగా విమర్శించారు. అరచేతిలో బెల్లం పెట్టి మోచేతిని నాకిస్తున్నారు ఇప్పుడు. రైతు భరోసా, రుణమాఫీ పై ఎన్నికల వేల బీరాలు పలికి ముఖ్యమంత్రి ఇప్పుడు నేల చూపులు చూస్తున్నాడని ధ్వజమెత్తారు కేటీఆర్‌.మంత్రి తుమ్మల వ్యాఖ్యలతో కౌలు రైతులు అయోమయం..తాజాగా రైతు భరోసాపై వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఢల్లీి వేదికగా చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రైతన్నలను అయోమయానికి గురిచేస్తున్నాయి. కౌలు రైతులకు రైతు భరోసా ఇవ్వలేమని కుండా బద్దలు కొట్టాడు. కౌలు రైతులను నమ్మించి తడి గుడ్డతో గొంతు కోసింది కాంగ్రెస్‌ ప్రభుత్వం. మొన్న రుణమాఫీ పేరిట మోసం చేశారు. నిన్న వానాకాలం పెట్టుబడి సాయం ఎగ్గొట్టారు. నేడు కౌలు రైతుకు భరోసా ఇవ్వలేమని చేతులెత్తేస్తారా..? అంటూ కాంగ్రెస్‌ సర్కార్‌ను కేటీఆర్‌ కడిగి పారేశారు.

గద్దెనెక్కాక గొంతు కోసిన వారిని అస్సలు వదిలిపెట్టరు..
కాంగ్రెస్‌ మ్యానిఫెస్టోలో చెప్పిందేంటి..? చేస్తున్నదేంటి..? 420 హామీల్లో ఒక్కో వాగ్దానాన్ని సీఎం పాతరేస్తున్నారు..? చేతకానప్పుడు హామీలు ఇవ్వడమెందుకు..? అధికారంలోకి రాగానే మాటతప్పడమెందుకు..? ఇది ముమ్మాటికీ మోసం.. నయవంచన.. తెలంగాణ రైతులు దేన్నైనా క్షమిస్తారు కానీ%ౌ%నమ్మించి ద్రోహం చేస్తే ఎట్టిపరిస్థితుల్లో క్షమించరు. గద్దెనెక్కాక గొంతు కోసిన వారిని అస్సలు వదిలిపెట్టరు. ఈ వెన్నుపోటుకు ముఖ్యమంత్రి మూల్యం చెల్లించుకోక తప్పదు అని కేటీఆర్‌ హెచ్చరించారు.