నాగార్జునసాగర్‌కు కొనసాగుతున్న వరద ప్రవాహం

శ్రీశైలం నుంచి నాగార్జునసాగర్ జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతోంది. దాంతో సాగర్ డ్యామ్‌ 22 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. సాగర్ పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా.. ప్రస్తుత నీటి మట్టం 584.50 అడుగులకు చేరుకుంది. పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 295.99 టీఎంసీల నీరు నిలువ ఉంది.మరోవైపు శ్రీశైలం జలాశయానికి కూడా వరద భారీగా కొనసాగుతోంది. జలాశయం 10 గేట్లను 12 అడుగుల మేర ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. శ్రీశైలం జలాశంయ ఇన్ ఫ్లో 2,74,443 క్యూసెక్కులు కాగా.. ఔట్ ఫ్లో 3,72,053 క్యూసెక్కులుగా ఉంది. పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా.. ప్రస్తుత నీటిమట్టం 883.20 అడుగులు. పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215.8070 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 205.6627 టీఎంసీల నీరు నిలువ ఉంది.మరోవైపు సూర్యాపేట జిల్లాలోని పులిచింతల ప్రాజెక్టు ఇన్ ఫ్లో 3,05,200 క్యూసెక్కులు కాగా.. ఔట్ ఫ్లో 20,000 క్యూసెక్కులుగా ఉంది. పులిచింతలకు ఎగువ నుంచి వస్తున్న వరద 3 లక్షల 27 వేల క్యూసెక్కులు. దాంతో విద్యుత్ ఉత్పత్తి కోసం పది వేల క్యూసెక్కుల నీటిని మళ్లించారు. పులిచింతల పూర్తి నిల్వ సామర్థ్యం 45.77 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం ప్రాజెక్టులో 26.79 టీఎంసీల నీరు నిలువ ఉంది. వరద మరింత పెరగనుండటంతో పులిచింతల దిగువ ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారుల సూచించారు.