మంత్రి పొంగులేటి ఇండ్లు, ఆఫీసుల్లో ఈడీ సోదాలు

రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్​రెడ్డి నివాసాలు, ఆఫీసుల్లో ఈడీ సోదాలుకొనసాగుతున్నాయి. హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లోని నివాసంతోపాటు 16 చోట్ల ఏకకాలంలో ఈడీ అధికారులు దాడులు నిర్వహించారు. శుక్రవారం ఉదయం నుంచి ఆయన నివాసంతోపాటు, హిమాయత్‌సాగర్‌లోని ఫామ్‌హౌస్‌లోనూ సోదాలు చేస్తున్నారు. అదేవిధంగా జూబ్లీహిల్స్‌లోని పొంగులేటి కుమార్తె ఇంటితోపాటు ఆయన బంధువుల ఇండ్లలోనూ తనిఖీలు చేస్తున్నారు. 16 బృందాలుగా విడిపోయి ఈడీ సోదాలు చేస్తున్నట్లు తెలుస్తున్నది. జూబ్లీహిల్స్​లోని నివాసంలో రెండు బృందాలు తనిఖీ చేస్తున్నాయి.