GO. 317 రద్దు చేయాలి PRTU TS దోమ మండల శాఖ

దోమ డిసెంబర్ 6(జనం సాక్షి)
స్థానికత ఆధారంగా తెచ్చుకున్న తెలంగాణలో ఉద్యోగుల పాలిట శాపంగా మారిన GO.317 ను సవరించాలి. రాత్రికి రాత్రే ప్రభుత్వం అనాలోచిత నిర్ణయం ద్వారా తీసుకొచ్చిన జీవో 317 ద్వారా ఉపాధ్యాయులు స్థానికత కోలిపోయి వేరువేరు జిల్లాలకు కేటాయించడం ద్వారా సంవత్సర కాలంగా తీవ్ర మానసిక క్షోభ కు గురవుతున్నారు కావున ఈరోజును ఉద్యోగ ఉపాధ్యాయులందరూ బ్లాక్ డేగా పాటించడం జరిగింది.ప్రభుత్వం వెంటనే స్థానికత కోలిపోయిన ఉపాధ్యాయులకు న్యాయం చేయాలి. బ్లాక్ లో పెట్టిన14 జిల్లాల స్పౌజ్ లను పరిశీలించాలి. అలాగే ప్రెసిడెన్షియల్ ఉత్తర్వులు సవరణ చేస్తూ స్కూల్ అసిస్టెంట్ ను జోనల్ పోస్టుగా గుర్తించాలి. వెంటనే ఉపాధ్యాయ బదిలీలు ప్రమోషన్స్ ను చేపట్టాలి అని
PRTU TS దోమ మండల శాఖ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఆర్. కేశవులు,కె.ప్రభాకర్ రెడ్డి ఒక ప్రకటనలో ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.