నూతన ఎమ్మెల్సీలను సన్మానించిన ఉద్యమ జర్నలిస్టులు

హైదరాబాద్ : గవర్నర్ కోటాలో నియమితులైన ఎమ్మెల్సీలు ప్రొఫెసర్ కోదండరాం, ఆమీర్ అలీ ఖాన్ లను తెలంగాణ ఉద్యమ జర్నలిస్టుల సంఘం (టీయూజేఎస్) ఆధ్వర్యంలో శుక్రవారం ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా సకల జనుల ఆకాంక్షలు నెరవేర్చడంలో తనవంతు బాధ్యతను తప్పక నెరవేరుస్తానని కోదండరాం అన్నారు. పాత్రికేయుల తరపున గళమెత్తుతానని ఆమీర్ అలీ ఖాన్ చెప్పారు. ఈ కార్యక్రమంలో టీయూజేఎస్ నేతలు ఎంఎం రహమాన్, మునీర్, కందుకూరి రమేష్ బాబు, సాదిక్, సుమబాల తదితరులు పాల్గొన్నారు.

తాజావార్తలు