మేం బనకచర్లకు ఒప్పుకోవాలంటే కృష్ణాలో 500.. గోదావరిలో 1000 టీఎంసీలకు ఎన్‌వోసీ ఇవ్వండి

` ప్రాజెక్టు అంకురార్పణ చేసింది కేసీఆర్‌, జగన్‌లే
` రాయలసీమకు గోదావరి జలాల తరలింపు ఆనాడే చర్చించుకున్నారు
` ఈ విషయమై కేసీఆర్‌ ఆనాడే ఒప్పుకొని సంతకం చేశారు
` ప్రభుత్వంపై బురద చల్లేందుకు బీఆర్‌ఎస్‌ రాజకీయాలు చేస్తోంది
` సచివాలయంలో మీడియా సమావేశంలో సీఎం రేవంత్‌ రెడ్డి
– పలు సందర్భాల్లో కేసీఆర్‌ చేసిన వ్యాఖ్యల వీడియోలు ప్రదర్శన
హైదరాబాద్‌(జనంసాక్షి): 2019 అక్టోబరులో కేసీఆర్‌, జగన్‌ కలిసి గోదావరి జలాలను రాయలసీమకు తరలించటంపై చర్చించుకున్నారు.. గోదావరి- బనకచర్ల ప్రాజెక్టుకు ఆనాడే అంకురార్పణ జరిగిందని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. రాజకీయాలు ఎలా ఉన్నా రైతుల విషయంలో రాజీ పడేది లేదని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి అన్నారు. గోదావరి-బనకచర్ల ప్రాజెక్టు విషయంపై అఖిలపక్ష ఎంపీలతో సమావేశం అనంతరం సీఎం మీడియాతో మాట్లాడారు. బనకచర్ల వ్యవహారంపై ఏ విధంగా ముందుకెళ్లాలనే అంశంపై విపక్షాలతో చర్చించినట్లు చెప్పారు. తెలంగాణకు గోదావరి, కృష్ణా నదులే జీవనాధారమని, ఈ ప్రభుత్వానికి రైతుల ప్రయోజనాలే ముఖ్యమని ఆయన స్పష్టం చేశారు. గతంలో కేసీఆర్‌ చేసిన వ్యాఖ్యల వీడియోలు సీఎం రేవంత్‌ రెడ్డి ప్రదర్శించారు. గోదావరి జలాలపై 2019 అక్టోబర్‌లో కేసీఆర్‌, జగన్‌ సమావేశమయ్యారని, గోదావరి జలాలను రాయలసీమకు తరలించటంపై చర్చించుకున్నారని అన్నారు. సీమకు గోదావరి జలాల తరలింపులో సహకరిస్తానని కేసీఆర్‌ అన్నట్లు నమస్తే తెలంగాణలో రాశారని తెలిపారు. అపెక్స్‌ కౌన్సిల్‌ భేటీలో ఎవరు ఏం మాట్లాడారో అంతా దస్త్రాల రూపంలో ఉందని, రాయలసీమకు గోదావరి జలాల తరలింపుపై చర్చించుకున్నామని ఆనాడు తెలంగాణ, ఏపీ మంత్రులు మీడియాకు చెప్పారని గుర్తు చేశారు.కేసీఆర్‌- జగన్‌ చర్చల సారాంశాన్ని తెలంగాణ, ఏపీ మంత్రులు మీడియాకు చెప్పారని అన్నారు. అపెక్స్‌ కౌన్సిల్‌ భేటీలో పాల్గొని కేంద్రానికి కేసీఆర్‌, హరీశ్‌రావు ఏం చెప్పారో అందరికీ తెలియాలని, రైతుల ప్రయోజనాలను కాపాడాలని నిర్ణయించుకున్నామని తెలిపారు. కొన్ని వాస్తవాలను కూడా ప్రజల ముందు ఉంచుతున్నామని, ఎంతో అనుభవం ఉందన్న వారే రాష్ట్రానికి నష్టం చేశారని విమర్శిచారు. ప్రజలను బీఆర్‌ఎస్‌ తప్పుదోవ పట్టిస్తోందని ఆరోపించారు. అధికారంలో ఉన్నప్పుడు ఒక విధంగా, అధికారం పోయాక మరో విధంగా మాట్లాడుతున్నారని,చచ్చిపోయిన పార్టీని బతికించుకునేందుకు మళ్లీ ఉద్వేగాలు రెచ్చగొడుతున్నారని ఆరోపించారు. సాగునీటి పారుదలశాఖ పదేళ్ల పాటు కేసీఆర్‌ కుటుంబం చేతిలోనే ఉందని, ఈ ప్రభుత్వంపై బురద చల్లేందుకు బీఆర్‌ఎస్‌ రాజకీయాలు చేస్తోందని, తెలంగాణకు గోదావరి, కృష్ణా నదులే జీవనాధారమని సీఎం అన్నారు. 21-9-2016న కేంద్ర ప్రభుత్వం అపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశం నిర్వహించిందని, ఏటా 3వేల టీఎంసీల నీరు వృథాగా గోదావరి నీరు సముద్రంలో కలుస్తోందని అపెక్స్‌ కౌన్సిల్‌ భేటీలో కేసీఆర్‌ అన్నారని, 3వేల టీఎంసీలు వృథాగా పోతున్నాయని మొదట మాట్లాడిరది కేసీఆరేనన తెలిపారు. గోదావరి-బనకచర్లపై అవసరమైతే సుప్రీంకోర్టుకైనా వెళ్లాలని భావిస్తున్నామని, నీటి ఒప్పందాలపై నిపుణులైన న్యాయవాదులను నియమించుకుంటామని అన్నారు. రాష్ట్ర ప్రయోజనాలు కాపాడుకునేందకు అన్ని ప్రయత్నాలు చేస్తామని, గోదావరి- బనకచర్లను వ్యతిరేకిస్తూ తీర్మానం చేసి కేంద్రానికి పంపాలని నిర్ణయించామన అన్నారు. అన్ని పార్టీలను కలుపుకొని పోరాడుతామని స్పష్టం చేశారు. తెలంగాణకు కృష్ణాలో 299 టీఎంసీలు సరిపోతాయని ఆనాడు కేసీఆర్‌ ఒప్పుకొని సంతకం చేశారని గుర్తు చేశారు. ఆనాడు కేసీఆర్‌ చేసిన సంతకం ఇవాళ తెలంగాణకు ప్రతిబంధకంగా మారిందని అన్నారు.మావేశం పూర్తిగా రాజకీయ దురుద్దేశంతో జరుగుతోంది. మీడియా సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి వ్యాఖ్యలపై అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్న బీఆర్‌ఎస్‌ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర అభ్యంతరం తెలిపారు. ఆనాడు తెలంగాణ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని కేసీఆర్‌ మాట్లాడారని వివరణ ఇచ్చారు. కృష్ణానదిని కలుపుతూ గోదావరి జలాలు తీసుకెళ్తే అభ్యంతరం లేదని కేసీఆర్‌ అన్నారని గుర్తు చేశారు. సమావేశం పూర్తిగా రాజకీయ దురుద్దేశంతో జరుగుతోందని అన్నారు.

 

కలిసికట్టుగా ముందుకెళ్దాం
` బనకచర్లపై సచివాలయంలో అఖిలపక్ష ఎంపీలతో భేటీలో ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి
` రైతుల ప్రయోజనాలకు ప్రభుత్వం కట్టుబడి ఉంది
` బనకచర్లపై కేంద్రానికి ఫిర్యాదు చేస్తాం
` ఈ విషయమై నేను,సీఎం కేంద్రమంత్రి కలుస్తాం
` పోలవరం-బనకచర్లతో తెలంగాణకు అన్యాయం
` ఎంపిలకు పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఇచ్చిన ఉత్తమ్‌
హైదరాబాద్‌(జనంసాక్షి):మా ప్రభుత్వానికి తెలంగాణ రైతాంగ ప్రయోజనాలే ముఖ్యమని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి స్పష్టం చేశారు. బనకచర్లపై సచివాలయంలో అఖిలపక్ష ఎంపీలతో భేటీలో ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడుతూ‘‘ రాజకీయాలకు అతీతంగా రైతుల ప్రయోజనాలు ఎజెండాగా మనం ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది. ఆ దిశగా మనందరం కలిసి పనిచేయాలి. రాజకీయ లబ్ది కోసం ఈ సమావేశం ఏర్పాటు చేయలేదు రాష్ట్ర ప్రయోజనాల కోసమే ఈ సమావేశం ఏర్పాటు చేశాం.తెలంగాణ ఏర్పడిన తరువాత కేంద్రప్రభుత్వం 21-9-2016 అపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశం ఏర్పాటు చేసింది. ఆ సమావేశంలో మొట్టమొదట గోదావరిపై 3 వేల టీఎంసీలు సముద్రంలో కలుస్తున్నాయని ఆనాటి సీఎం కెసీఆర్‌ ప్రతిపాదన ఇచ్చారు. ఆ సమావేశంలో హరీష్‌ రావుగారు కూడా పాల్గొన్నారు.మళ్లీ 13 ఆగస్టు 2019 లో రాయలసీమను రతనాల సీమ చేస్తామని ఆనాటి తెలంగాణ సీఎం కెసీఆర్‌ ప్రకటించారు.గోదావరి జలాలలను రాయలసీమకు తరలించాలని కెసిఆర్‌, జగన్‌ ప్రగతి భవన్‌ లో నాలుగుసార్లు సమావేశమయి నిర్ణయం తీసుకున్నారు. ఇరు రాష్ట్రాల సిఎంల భేటీ వివరాలను ఆనాటి మంత్రులు ఈటెల రాజేందర్‌ , బుగ్గన రాజేంద్ర ప్రసాద్‌ ప్రెస్‌ మీట్‌ పెట్టి వెల్లడిరచారు. ఈ మీటింగ్‌ మినిట్స్‌ ను రిఫరెన్స్‌ గా చూపి ఆంధ్రప్రదేశ్‌ తెలంగాణకు బనకచర్లను గుదిబండగా మార్చే ప్రయత్నం చేస్తోంది. ఇందుకు సమబంధించి అఫీషియల్‌ డాక్యుమెంట్స్‌ మీకు అందించడానికి సిద్ధంగా ఉన్నాం.బనకచర్ల అంశంపై పార్లమెంట్‌ సమావేశాల్లో ప్రధానితో సహా అందరి అపాయింట్మెంట్‌ తీసుకుని కలిసి తెలంగాణ సమస్యలను వివరిస్తాం.పొలిటికల్‌ ఫైట్‌ లో న్యాయం జరగకపోతే లీగల్‌ ఫైట్‌ చేద్దాం.ఈ విషయంలో మనందరం కలిసికట్టుగా ముందుకు వెళతాం.
రైతుల ప్రయోజనాలకు ప్రభుత్వం కట్టుబడి ఉంది:ఉత్తమ్‌
బనకచర్ల విషయంలో ఎపి దూకుడుకు కళ్లెం వేసేందుకు ప్రభుత్వం సిద్దమయ్యింది. ఈ మేరకు గురువారం కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్‌ పాటిల్‌ని సిఎం రేవంత్‌ రెడ్డి, మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డిల నేతృత్వంలోని బృందం కలవనుంది. బుధవారం సాయంత్రం గోదావరి-బనకచర్లపై ఎంపిలకు మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి ప్రజెంటేషన్‌ ఇచ్చారు. ఈ సమావేశానికి సిఎం రేవంత్‌ రెడ్డితో పాటు కాంగ్రెస్‌ ఎంపిలు, బిజెపి ఎంపిలు డికె అరుణ, రఘునందన్‌ రావు, బిఆర్‌ఎస్‌ ఎంపి రవిచంద్ర, ఎంఐఎం ఎంపి అసదుద్ధీన్‌ ఓవైసీ హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్‌ మాట్లాడుతూ.. పోలవరం-బనకచర్ల విషయంలో ఎపి విభజన చట్టాన్ని ఉల్లంఘిస్తోందని అన్నారు. ఎపి రిపోర్టుపై స్పందించాలని కేంద్రం తమని అడిగిందని తెలిపారు. పూర్తిస్థాయి నివేదికను కేంద్రానికి సమర్పిస్తామని ఉత్తమ్‌ పేర్కొన్నారు. తను, సిఎం ఢల్లీికి వెళ్లి రాష్ట్ర అభ్యంతరాలను తెలుపుతామని స్పష్టం చేశారు. పోలవరం-బనకచర్ల లింక్‌ ప్రాజెక్టు తెలంగాణ నీటి హక్కులకు పెద్ద దెబ్బ అని తెలిపారు. ఈ ప్రాజెక్టును పరిశీలించడం అంటే రాష్ట్ర హక్కులను కాలరాయడమే అని అన్నారు. పోలవరం-బనకచర్ల ప్రాజెక్టును తిరస్కరించాలని కేంద్రానికి స్పష్టంగా చెప్పామని వెల్లడిరచారు. గోదావరి ట్రైబ్యునల్‌ అవార్డును బనకచర్ల ప్రాజెక్టు ఉల్లంఘిస్తుందని.. తెలంగాణకు అనుకూలమైన ఇచ్చంపల్లిని ఎపి వ్యతిరేకించిదని మండిపడ్డారు. అత్యవసరంగా పోలవరం ప్రాజెక్టు అథారిటీ సమావేశం ఏర్పాటు చేయాలని కోరామన్నారు. తెలంగాణ వాటా 968 టిఎంసిలలో కట్టుకొనే ప్రాజెక్టులను ఎపి వ్యతిరేకించిందని.. బనకచర్ల వల్ల మన వాటా జలాలకు కూడ భవిష్యత్తులో ఎదురుదెబ్బ తగులుతుందని అన్నారు. పూర్తయిన ప్రాజెక్టులకు అధిక కేటాయింపులను భవిష్యత్తులో ఎపి అడుగుతుందని పేర్కొన్నారు. దీనిపై కేంద్రానికి జనవరి 22న అభ్యంతరాలను చెప్పామన్నారు. అయితే ఎపి నుంచి డిపిఆర్‌ అందలేదని కేంద్రం సమాధానం ఇచ్చిందని తెలిపారు.గోదావరి-బనకచర్లపై అన్ని పార్టీలతో చర్చలు జరుపుతున్నాం. రాష్ట్ర రైతుల ప్రయోజనాలకు ప్రభుత్వం కట్టుబడి ఉంది. గోదావరి-బనకచర్లపై ఏపీ ప్రభుత్వం కేంద్రానికి ఫీజిబులిటీ నివేదిక సమర్పించింది’’ అని వివరించారు.

 

హైదరాబాద్‌లో గూగుల్‌ సేఫ్టీ సెంటర్‌
` జీఎస్‌ఈసీ కేంద్రాన్ని ప్రారంభించిన సీఎం రేవంత్‌
` డిజిటల్‌ భద్రతే దీని ప్రధాన లక్ష్యం
` తెలంగాణ రైజింగ్‌లో సంస్థ తోడ్పాటు అవసరమని వెల్లడి
హైదరాబాద్‌(జనంసాక్షి): ప్రపంచం మొత్తం డిజిటల్‌ యుగంగా మారుతోందని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. డిజిటల్‌ సమాచారం భద్రంగా ఉంటే ప్రజలు క్షేమంగా ఉన్నట్లే అని చెప్పారు. హైదరాబాద్‌లో గూగుల్‌ సేప్టీ ఇంజినీరింగ్‌ సెంటర్‌ను ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడారు. జీఎస్‌ఈసీ కేంద్రాన్ని ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. డిజిటల్‌ భద్రతే దీని ప్రధాన లక్ష్యమని చెప్పారు. ‘గూగుల్‌ ఇన్నోవేటివ్‌ కంపెనీ.. మాది ఇన్నోవేటివ్‌ ప్రభుత్వం. నైపుణ్యాలు పెంచేందుకు స్కిల్‌ వర్సిటీ ఏర్పాటు చేశాం. ఉత్తమ పెట్టుబడులకు గమ్యస్థానంగా తెలంగాణ మారుతోందని ఈ సందర్భంగా అన్నారు.. 2035 నాటికి 1 ట్రిలియన్‌ డాలర్ల ఎకానవిూగా, 2047 నాటికి 3 ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తెలంగాణ మారాలన్న లక్షయంతో ముందుకు వెళుతున్నామని అన్నారు. తెలంగాణ రైజింగ్‌లో భాగంగా కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా మారుస్తున్నాం అన్నారు. ఇక్కడి మహిళలు ధనిక పెట్టుబడిదారులకు పోటీదారులుగా మారుతున్నారు. ప్రభుత్వంలో నూతన ఆవిష్కరణలు, విధానాలు తీసుకొచ్చాం‘అని రేవంత్‌రెడ్డి తెలిపారు.
ఆసియా పసిఫిక్‌ ప్రాంతంలో గూగుల్‌ మొదటి సేప్టీ ఇంజనీరింగ్‌ సెంటర్‌ ను ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. ఇది ప్రపంచంలో ఐదవది మాత్రమే అని తెలిపారు. గూగుల్‌ ప్రారంభించినప్పటి నుంచి ప్రపంచం మారిపోయిందని.. నేడు మన జీవితాలు పూర్తిగా డిజిటల్‌గా మారాయన్నారు. గోప్యత, భద్రత గురించి నేడు ఆందోళన చెందుతున్నామని తెలిపారు. మన ఆర్థిక వ్యవస్థ, మన ప్రభుత్వం, మన జీవితాలు డిజిటల్‌గా మారాయి. డిజిటల్‌ సురక్షితంగా ఉంటే, మనం మరింత అభివృద్ధి చెందుతామని చెప్పుకొచ్చారు. అధునాతన సైబర్‌ సెక్యూరిటీ, భద్రతా పరిష్కారాల కోసం గూగుల్‌ ఈ సైబర్‌ సెక్యూరిటీ హబ్‌ను ఉపయోగి స్తున్నందుకు గర్విస్తున్నట్లు తెలిపారు. ఇది నైపుణ్య అభివృద్ధిపై దృష్టి పెడుతుందన్నారు. ఉపాధిని సృష్టించడంతో పాటు దేశం సైబర్‌ భద్రతా సామర్థ్యాన్ని పెంచుతుందన్నారు. చెడు చేయవద్దన్నది గూగుల్‌ సంస్థ సిద్దాంతమని.. ఈ విధానాన్ని తాను ఇష్టపడుతున్నట్లు తెలిపారు. గూగుల్‌లా, కాంగ్రెస్‌ ప్రభుత్వం కూడా మంచిని మాత్రమే చేస్తుందని నమ్ముతున్నానన్నారు. ఈ విధానం వల్ల ప్రయోజనాలు కొంత నెమ్మదిగా కనిపిస్తాయని.. అయితే మనం దీర్ఘకాలికంగా దృష్టిపెట్టి పనిచేయాలని సూచించారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సంస్థలు ఉత్తమ పెట్టుబడికి అనుకూల రాష్ట్రం కోసం శోధిస్తే దానికి సమాధానం తెలంగాణ అని వస్తుందన్నారు. సెర్చ్‌లో మొదటి లింక్‌ హైదరాబాద్‌ వస్తుందని సీఎం రేవంత్‌ అన్నారు. దీనిని తెలంగాణ రైజింగ్‌ అని పిలుస్తామని… 2035 నాటికి తెలంగాణను 1 ట్రిలియన్‌ ఆర్థిక వ్యవస్థగా అభివృద్ధి చేయాలనుకుంటున్నట్లు చెప్పారు. 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలనుకుంటున్నట్లు తెలిపారు. గూగుల్‌ ఆఫీస్‌ పక్కన రెండున్నర ఎకరాల్లో స్వయం సహాయక సంఘాల మహిళల కోసం స్టాల్స్‌ ఏర్పాటు చేశామని.. రైతులను సంపన్నులుగా తయారు చేయడంతో పాటు సంతోషంగా ఉంచాలను కుంటున్నామని తెలిపారు. యువతలో నైపుణ్యాలు పెంచడంతో పాటు వారికి ఉపాధి కల్పించాలని అనుకుంటున్నట్లు చెప్పారు. అందుకు గూగుల్‌ మద్దతు కావాలని.. తెలంగాణ రైజింగ్‌కు బ్రాండ్‌ అంబాసిడర్లుగా కావాలని కోరుకుంటున్నామన్నారు. గూగుల్‌, హైదరాబాద్‌ పాత స్నేహితులన్నారు. 2007లో కాంగ్రెస్‌ ప్రభుత్వ పాలనలో గూగుల్‌ తన మొదటి కార్యాలయాన్ని ఇక్కడ ఏర్పాటు చేసిందని గుర్తుచేశారు. దాదాపు 7,000 మంది గూగుల్‌ ఉద్యోగులు నేడు హైదరాబాద్‌ను తమ ఇల్లుగా భావిస్తున్నా రన్నారు. విద్య, భద్రత, మ్యాప్‌లు, ట్రాఫిక్‌, స్టార్టప్‌లు, ఆరోగ్యం ఇలా అనేక రంగాలలో గూగుల్‌తో కలిసి పనిచేస్తున్నామన్నారు. గూగుల్‌ ఒక వినూత్న సంస్థ, తమది ఒక వినూత్న ప్రభుత్వమని తెలిపారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇటీవల హైదరాబాద్‌ ట్రాఫిక్‌ నియంత్రణ కోసం ట్రాన్స్‌జెండర్‌లను నియమించినట్లు చెప్పుకొచ్చారు. గత ప్రభుత్వాలు ట్రాన్సజెండర్స్‌ని నిర్లక్ష్యం చేశాయన్నారు. జీహెచ్‌ఎంసీ కూడా వివిధ పనుల కోసం ట్రాన్స్‌జెండర్‌లను నియమించుకుంటోందన్నారు. నాణ్యమైన విద్య తమ లక్ష్యమని.. ఇందుకోసం యంగ్‌ ఇండియా నైపుణ్య విశ్వవిద్యాలయం, యంగ్‌ ఇండియా ఇంటిగ్రేటెడ్‌ రెసిడెన్షియల్‌ స్కూల్స్‌ను తీసుకువస్తున్నామని తెలిపారు. తెలంగాణలో ప్రతీ సంవత్సరం 1.10 లక్షల ఇంజనీర్స్‌ కాలేజ్‌ల నుంచి వస్తున్నారని… చాలా మంది విద్యార్థులకు నైపుణ్యం ఉండడం లేదన్నారు. విద్యార్థుల్లో నైపుణ్యాల పెంపు కోసం ఆనంద్‌ మహీంద్రా నేతృత్వంలో యంగ్‌ ఇండియా స్కిల్స్‌ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తున్నామన్నారు. పబ్లిక్‌, ప్రైవేట్‌ భాగస్వామ్యంలో యూనివర్సిటీ ఏర్పాటు చేస్తున్నామన్నారు. అందరికీ ఆరోగ్యం తమ లక్ష్యమని స్పష్టం చేశారు. ఇవే తన ప్రధాన ఆవిష్కరణలన్నారు. ’గూగుల్‌ లాగానే, నా ప్రభుత్వంలో భాగస్వాములైన మహిళలు, యువత, రైతులు, పేదలు, మధ్యతరగతి, సీనియర్‌ సిటిజన్లు, పిల్లలకు ఉన్నతమైన జీవన ప్రమాణాలు కల్పించాలని కోరుకుంటున్నాను. మనం కలిసి గొప్ప ప్రమాణాలను సృష్టిద్దాం. హైదరాబాద్‌లో విూ కొత్త సేప్టీ ఇంజనీరింగ్‌ సెంటర్‌ ఏర్పాటు చేసినందుకు మరోసారి అభినందిస్తున్నాను. మేం గర్వపడేలా విూరు పనిచేస్తారని విశ్వసిస్తున్నాను’ అని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి శ్రీధర్‌ బాబు తదితరులు పాల్గొన్నారు. ఆసియా-పసిఫిక్‌ రీజియన్‌లో టోక్యో తర్వాత గూగుల్‌ మొదలుపెట్టిన రెండో సెంటర్‌ ఇది. ఇక ప్రపంచవ్యాప్తంగా చూస్తే ఇది ఐదవది కావడం గమనార్హం. గతేడాది ఆగస్టులో సీఎం రేవంత్‌ రెడ్డి అమెరికా పర్యటనలో గూగుల్‌ ప్రధాన కార్యాలయాన్ని సందర్శించి, హైదరాబాద్‌లో ఈ సెంటర్‌ ఏర్పాటు చేయాలని కంపెనీ ప్రతినిధులను కోరారు. ఈ విషయంలో ప్రత్యేక చొరవ తీసుకున్నారు. ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ ఆధారిత భద్రతా వ్యవస్థలు, ఆన్‌లైన్‌ సేప్టీ టూల్స్‌ను అభివృద్ధి చేయడంలో ఇది కీలకంగా పనిచేయనుంది. ప్రపంచ నిపుణులు, పరిశోధకులు ఇందులో భాగమవుతారు. ఈ కేంద్రం ద్వారా వేలాది ఉద్యోగ అవకాశాలు ప్రత్యక్షంగా, పరోక్షంగా రాష్ట్ర యువతకు లభించే అవకాశముంది. ఐటీ రంగంలో తెలంగాణ మరింత ముందుకు దూసుకుపోతుందన్నది ఈ అభివృద్ధి సంకేతం.

 

 

బ్రహ్మోస్‌ ఏరోస్పేస్‌ విస్తరణ హైదరాబాద్‌ అనుకూలలం
` సిఎం రేవంత్‌
హైదరాబాద్‌(జనంసాక్షి):హైదరాబాద్‌ లో బ్రహ్మోస్‌ ఏరోస్పేస్‌ సంస్థను విస్తరించాలని సీఎం రేవంత్‌ రెడ్డి కోరారు. హైదరాబాద్‌, బెంగుళూరు డిఫెన్స్‌ కారిడార్‌ ఏర్పాటు చేసేందుకు అనుకూలమైనవని రేవంత్‌ వివరించారు. ఇప్పటికే హైదరాబాద్‌ లో డిఫెన్స్‌ కు సంబంధించి వివిధ సంస్థలు ఉన్నాయని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు. జూబ్లీహిల్స్‌ నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డిని బ్రహ్మోస్‌ ఏరోస్పేస్‌ ప్రతినిధి బృందం మర్యాదపూర్వకంగా కలిసింది. బ్రహ్మోస్‌ ఏరోస్పేస్‌ ఎండీ / సీఈవో డా, జైతీర్థ్‌ ఆర్‌. జోషి, బ్రహ్మోస్‌ హైదరాబాద్‌ ఎక్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ సూరంపూడి సాంబశివ ప్రసాద్‌, డీఆర్‌డీఎల్‌ డైరెక్టర్‌ జీ.ఏ. శ్రీనివాస మూర్తి, తదితరులు సీఎంతో భేటీ అయ్యారు. దేశంలో పెట్టుబడులకు తెలంగాణ అనుకూల ప్రదేశమని చెప్పారు.బ్రహ్మోస్‌ ఏరోస్పేస్‌ విస్తరణకు తెలంగాణ, హైదరాబాద్‌ను ఎంచుకోవాలని, ప్రభుత్వం వైపు నుంచి అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తామని స్పష్టం చేశారు. సీఎం వాదనలపై బ్రహ్మోస్‌ ఏరోస్పేస్‌ బృందం సానుకూలంగా స్పందించింది. ఈ భేటీలో మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌ బాబు పాల్గొన్నారు.

నేడు ఢల్లీికి సీఎం రేవంత్‌రెడ్డి?
హైదరాబాద్‌(జనంసాక్షి): తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి నేడు దిల్లీ వెళ్లే అవకాశముంది. రెండు రోజుల పాటు ఆయన అక్కడ పర్యటించనున్నట్లు సమాచారం. కాంగ్రెస్‌ అగ్రనేతలను సీఎం కలిసే వీలుంది. పీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్లు, కార్పొరేషన్‌ ఛైర్మన్ల ఎంపికపై వారితో రేవంత్‌రెడ్డి చర్చించే అవకాశముంది.మరోవైపు బ్రిటన్‌ మాజీ ప్రధాని టోనీబ్లెయిర్‌, ఇతర అధికారులను సీఎం కలవనున్నట్లు సమాచారం. రాష్ట్రానికి పెట్టుబడులను ఆహ్వానించేందుకు వారితో చర్చించనున్నట్లు సమాచారం.