దేశంలోనే అతిపెద్ద ప్రైవేట్ రాకెట్ తయారీ కేంద్రం


ఐటీ, బయోటెక్ హబ్‌గా ఎదిగిన భాగ్యనగరం, ఇప్పుడు అంతరిక్ష పరిశోధనలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభిస్తోంది. శంషాబాద్ ప్రాంతంలో ఏర్పాటు చేసిన స్కైరూట్ ఇన్ఫినిటీ క్యాంపస్ దేశంలోనే అతి పెద్ద ప్రైవేట్ రాకెట్ తయారీ కేంద్రంగా నిలుస్తోంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈ ఫ్యాక్టరీని వర్చువల్‌గా ప్రారంభించారు. స్కైరూట్ ఇన్ఫినిటీ క్యాంపస్ దాదాపు రెండు లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేశారు. రాకెట్ డిజైన్, అసెంబ్లీ, టెస్టింగ్, ఇంటిగ్రేషన్ – ఒకే క్యాంపస్‌లో ఈ అన్ని వ్యవస్థలు ఉండటం దేశంలో ఇదే మొదటిసారి. ప్రతి నెల ఒక ఆర్బిటల్ రాకెట్ తయారు చేసే సామర్థ్యంతో ఈ ఫ్యాక్టరీ స్పేస్ రంగంలో పెద్ద మార్పున‌కు నాంది పలుకుతోంది.