కేసీఆర్కు బీఆర్ఎస్,జాగృతి రెండు కళ్లు
` ఆయనమీద ఈగ వాలినా ఊరుకోసం
` కాళేశ్వరం కమిషన్ నోటీసులపై జూన్ 4న రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు
` బనకచర్ల ద్వారా గోదావరి జలాల దోపిడీ:కవిత
హైదరాబాద్(జనంసాక్షి):కెసిఆర్ విూద ఈగవాలినా ఊరుకునేది లేదని భారాస ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత హెచ్చరించారు. తెలంగాణ ప్రజల గొంతుకగా తెలంగాణ జాగృతి సంస్థ పనిచేసిందని కవిత అన్నారు. కెసిఆర్కు జాగృతి, బిఆర్ఎస్ రెండు కళ్లని అన్నారు. కాళేశ్వరం కమిషన్ నోటీసులపై జూన్ 4న పెద్ద ఎత్తున ఇందిరాపార్క్ వద్ద ధర్నా చేస్తామని ప్రకటించారు. బంజారాహిల్స్లో ఏర్పాటు చేసిన ’తెలంగాణ జాగృతి’ నూతన కార్యాలయాన్ని ఆమె ప్రారంభించారు. అనంతరం విూడియాతో మాట్లాడుతూ కేసీఆర్, ఆచార్య జయశంకర్ స్ఫూర్తితో జాగృతి సంస్థ ఏర్పడిరదన్నారు. తెలంగాణ తెచ్చినందుకా లేక తెలంగాణ కోసం పనిచేసినందుకా కెసిఆర్కు నోటీసులు ఇచ్చారని ప్రశ్నించారు. అది కాళేశ్వరం కమిషన్ కాదని, కాంగ్రెస్ కమిషన్ అంటూ విమర్శలు గుప్పించారు. ఈ సందర్భంగా కెసిఆర్పై ఈగవాలినా సహించబోమని హెచ్చరించారు. జాగృతి సంస్థను ప్రారంభించి 18ఏళ్లు అయిందని, ఇప్పటి వరకు అశోక్నగర్లో జాగృతి కార్యాలయం ఉండేది.. ఇప్పుడు బంజారాహిల్స్కు మార్చామని, ఇకపై ఇక్కడి నుంచే సంస్థ కార్యకలాపాలు కొనసాగిస్తామని అన్నారు. ఇన్నేళ్ల ప్రయాణంలో ఎందరో ఆశీస్సులు అందించారు. మేము చేసిన ఉద్యమాల వల్ల చాలా జీవోలు వచ్చాయి. గత పదేళ్ల కేసీఆర్ పాలనకు.. ఇప్పటి కాంగ్రెస్ పాలనకు ఎంతో తేడా ఉంది. సీఎం రేవంత్రెడ్డి ఇప్పటికైనా ’జై తెలంగాణ’ అనాలి. అమరవీరులకు నివాళులు అర్పించాలి. కనీసం రాష్ట్ర అవతరణ దినోత్సవం రోజైనా రేవంత్రెడ్డి.. ’జై తెలంగాణ’ అనాలని డిమాండ్ చేశారు. జూన్ 2న రాజీవ్ యువ వికాసం పథకం ఎందుకు తెస్తున్నారు. రాజీవ్ గాంధీకి తెలంగాణకు ఏం సంబంధం. తెలంగాణ యువ వికాసం అని ఉండాలి కానీ, రాజీవ్ యువ వికాసం అని ఉండకూడదన్నారు. కేసీఆర్కు రెండు కళ్లలా పనిచేస్తాం.. ఒక కన్ను భారాస అయితే, రెండోది జాగృతి సంస్థ. కేసీఆర్పై ఈగ వాలినా ఊరుకోం. కేసీఆర్కు నోటీసులు ఇచ్చారంటే.. యావత్ తెలంగాణకు నోటీసులు ఇచ్చినట్టే. ఈ రాష్టాన్రికి ఆయన ఏం చేశారో ప్రజలందరికీ తెలుసు తెలంగాణ తెచ్చిన వ్యక్తికి నోటీసులు ఇస్తారా? అది కాళేశ్వరం కమిషన్ కాదు.. కాంగ్రెస్ కమిషన్ అంటూ నిప్పులు చెరిగారు. కేసీఆర్కు కాళేశ్వరం కమిషన్ నోటీసులు ఇవ్వడాన్ని నిరసిస్తూ జూన్ 4న ఇందిరా పార్క్ వద్ద మహాధర్నా నిర్వహిస్తాం. మహాధర్నాలో నోటీసుల కుట్ర మొత్తం వివరిస్తాం. గోదావరి-కావేరీ లింకేజీతో నదీ జలాలు
తెలంగాణకు శాశ్వతంగా దూరమవుతాయి. బనకచర్ల ద్వారా ఏపీ ప్రభుత్వం నీళ్లు తీసుకుపోతుంటే రేవంత్రెడ్డి ఏం చేస్తున్నారు? నదుల అనుసంధానాన్ని కేసీఆర్ వ్యతిరేకించారు. తుపాకుల గూడెం వద్ద రివర్ లింకేజీ ఉండాలని ఆయన సూచించారు. ఇచ్చంపల్లి వద్ద రివర్ లింకేజీ పెడతామని కేంద్రం చెప్పింది. జూన్ 2న నదీ జలాలపై సీఎం స్పష్టమైన ప్రకటన చేయాలి. అపెక్స్ కౌన్సిల్ సమావేశం పెట్టాలని డిమాండ్ చేయాలని కవిత డిమాండ్ చేశారు. బంజారాహిల్స్ కార్యాలయంలో ఆచార్య జయశంకర్, కేసీఆర్ ఫొటోలతో తెలంగాణ జాగృతి బ్యానర్ పెట్టారు. కొత్త కార్యాలయంలో బీఆర్ అంబేడ్కర్, ఆచార్య జయశంకర్, తెలంగాణ తల్లి, జ్యోతిబా ఫులే, సావిత్రిబాయి ఫులే విగ్రహాలతో పాటు- అమరవీరుల స్థూపాన్ని ఏర్పాటు- చేశారు. తెలంగాణ అవతరణ దినోత్సవం నాడు అమరవీరులకు రేవంత్ నివాళులర్పించాలి. నివాళులర్పించని వారికి కుర్చీలో కూర్చునే అర్హత లేదు. ఉద్యమకారులపైకి గన్ తీసుకెళ్లిన వాళ్లు.. ప్రస్తుతం రాష్టాన్రికి సీఎం అయ్యారు. తెలంగాణ పథకాలకు తెలంగాణ వారి పేర్లే పెట్టాలి. తెలంగాణ యువ వికాసం అని ఉండాలి.. రాజీవ్ యువవికాసం అని కాదు. వేరే రాష్ట్రం తెలంగాణ నీళ్లు తీసుకెళ్తుంటే మాట్లాడలేని పరిస్థితి రేవంత్ది. బనకచర్ల ప్రాజెక్ట్పై రేవంత్ ఎందుకు మాట్లాడటం లేదు. గోదావరి నీళ్లు శాశ్వతంగా దూరం కాబోతున్నాయి. ఏపీ ప్రయోజనాల కోసమే రేవంత్ పనిచేస్తున్నారని విమర్శలు గుప్పించారు. కేసీఆర్ పిడికిలి బిగిస్తేనే తెలంగాణ వచ్చింది. కేసీఆర్కు నోటీసులు ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ.. జూన్ 4న ఇందిరాపార్క్ దగ్గర మహాధర్నా చేపడుతున్నాం. గోదావరి జలాల్లో వాటా కాపాడకపోతే.. తెలంగాణ జాగృతి ఉద్యమిస్తుందని అన్నారు. కేంద్రం బిసిలకు 42శాతం రిజర్వేషన్లు ప్రకటించాలని,లేకుంటే రైలురోకోలాంటికార్యక్రమాకలు వెనకాడమని అన్నారు.