మెద‌క్ జిల్లా ఏడుపాయ‌ల దేవాల‌యంలో భారీ చోరీ

మెద‌క్ : జిల్లా ప‌రిధిలోని ఏడుపాయ‌ల దేవాల‌యంలో భారీ చోరీ జ‌రిగింది. గర్భ గుడి ముందున్న 2 హుండీల‌ను శుక్ర‌వారం రాత్రి దొంగ‌లు అప‌హ‌రించారు. శ‌నివారం తెల్ల‌వారుజామున ఆల‌యం వ‌ద్ద‌కు చేరుకున్న పూజారులు.. హుండీలు మాయ‌మైన దృశ్యాన్ని గ‌మ‌నించారు. దీంతో పూజారులు పోలీసుల‌కుస‌మాచారంఅందించారు.ఏడుపాయ‌ల ఆల‌యం వ‌ద్ద‌కు చేరుకున్న పోలీసులు.. ప‌రిస‌ర ప్రాంతాల‌ను ప‌రిశీలించ‌గా, పాత క‌ల్యాణ‌క‌ట్ట వ‌ద్ద హుండీలు క‌నిపించాయి. రెండు హుండీల‌ను ధ్వంసం చేసి న‌గ‌దు, విలువైన కానుక‌ల‌ను దొంగ‌లు అప‌హ‌రించిన ఆన‌వాళ్లు ఉన్నాయి. ప‌ది రోజుల క్రిత‌మే ఆల‌యంలోని హుండీల‌ను సిబ్బంది లెక్కించారు. ఈ చోరీ ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసుకున్న పాప‌న్న‌పేట పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు. స్థానికంగా ఉన్న సీసీ కెమెరాల‌ను పోలీసులు ప‌రిశీలిస్తున్నారు.