ప్రమాణస్వీకారం చేసిన మరుక్షణమే బాధ్యతలపై దృష్టి సారించాలి

  • ` దేశ అభివృద్ధి కోసం చేపట్టిన ప్రాజెక్టులను సకాలంలో పూర్తి చేసేలా పనిచేయాలి
    ` తేనీటి విందులో మంత్రులకు మోదీ దిశానిర్దేశం
    దిల్లీ(జనంసాక్షి):ప్రధాని మోదీ ప్రమాణ స్వీకారానికి అంతా సిద్ధమైంది. ఈ నేపథ్యంలో భాజపా నుంచి కాబోయే మంత్రులకు తేనేటి విందు కార్యక్రమం ఏర్పాటు చేశారు. దేశ అభివృద్ధి కోసం ఈ భేటీలో నేతలకు మోదీ కీలక సూచనలు చేసినట్లు తెలుస్తోంది.కేంద్రమంత్రులుగా ప్రమాణస్వీకారం చేసిన మరుక్షణమే బాధ్యతలపై దృష్టి సారించాలని.. దేశ అభివృద్ధి కోసం చేపట్టిన ప్రాజెక్టులను సకాలంలో పూర్తి చేసేలా పనిచేయాలని మోదీ దిశానిర్దేశం చేశారు.