PNPS దోమ మండల అధ్యక్షులుగా అడ్వకేట్ పాలే పల్లి ప్రతాప్ గౌడ్*

న్యూస్ జనం సాక్షి
వికారాబాద్ జిల్లా దోమ మండల కేంద్రంలో ని నియోజక వర్గ పరిరక్షణ సమితి దోమ మండల అధ్యక్షులుగా పాలేపల్లి ప్రతాప్ గారిని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలొ ప్రతాప్ గౌడ్ కి నియామక పత్రం అందిస్తూ పరిగి నియోజకవర్గ పరిరక్షణ సమితి వ్యవస్థాపక అధ్యక్షులు రాఘవేందర్ గౌడ్ మాట్లాడుతూ దోమ మండలంలో పలు సమస్యలపై ప్రజా ఉద్యమాలు నిర్వహించి ప్రాంత అభివృద్ధిపై తోడ్పడాలని న్యాయవాది ప్రతాప్ గౌడ్ ని సూచించారు ఈ కార్యక్రమంలో పి ఎన్ పి ఎస్ సభ్యులు కృష్ణ గోపాలకృష్ణ బాలకృష్ణ మనీ నరసింహులు మహిపాల్ తదితరులు పాల్గొన్నారు