వాస్తవాలు ప్రజలకు చెప్పండి

` యుద్ధ విషయాలు ప్రపంచానికి తెలియాలి
` రాఫెల్‌ యుద్ధవిమానాల కూల్చివేతపై సరైన వివరణ ఇవ్వాలి
` విజయాలతో పాటు లోటుపాట్లను కూడా ప్రజలకు చెప్పాలి
` ఆపరేషన్‌ సిందూర్‌పై మేం రాజకీయం చేయడం లేదు
` కాల్పుల విరమణ ప్రకటనను అమెరికా చేయడంలో ఆంతర్యం ఏమిటి..?
` ఇండియా-పాక్‌ ఘర్షణల్లో భారత వాయుసేన పాత్ర అమోఘం
` సాంకేతిక సామర్ధ్యాలపై కేంద్రం పునఃసమీక్షించాలి
` భారత వాయుసేనలో ప్రతిభాపాటవలను సమీక్షించాలి
` ఫైటర్‌ జెట్లు అందించడంలో హెచ్‌.ఏ.ఎల్‌.విఫలం
` సాయుధ దళాలను మరింత బలోపేతం చెయ్యాలి
-మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి
హైదరాబాద్‌(జనంసాక్షి):ఇటీవల ఇండియా-పాక్‌ మధ్యన జరిగిన యుద్ద రంగంలో పాకిస్థాన్‌ దేశం భారతదేశానికి చెందిన రాఫెల్‌ యుద్ద విమానాల కూల్చివేత అంశాన్ని బహిర్గతం చేయాలని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖామంత్రి కెప్టెన్‌ ఎన్‌.ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి డిమాండ్‌ చేశారు.రాఫెల్‌ యుద్ద విమానాల కూల్చివేతపై సూటిగా నిలదీసినందుకు కేంద్ర ప్రభుత్వం లోకసభలో ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీని దేశద్రోహిగా నిలబెట్టాలని చూసిందని ఆయన మండిపడ్డారు.అలీన దేశాల ఐక్యత నుండి భారతదేశంలో మత సామరస్యాన్ని కాపాడుతున్న గాంధీల కుటుంబం దేశ సమగ్రత, సనైక్యత ల కోసం చేసిన త్యాగాలు అనిర్వచనీయమైనవని,అటువంటి కుటుంబం నుండి వచ్చిన రాహుల్‌ గాంధీపై నిందారోపణలు మోపడం శోచనీయమన్నారు.అయినా భారతదేశం-పాకిస్తాన్‌ ల మధ్యన కాల్పుల విరమణ ప్రకటనను అమెరికా చేయడంలో అంతర్యం ఏమిటని ఆయన సూటిగా ప్రశ్నించారు శనివారం మద్యాహ్నం దేశ రాజధాని కొత్త ఢల్లీిలోని ఏ.ఐ.సి సి కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి మాట్లాడారు.తాజాగా ఇండియా-పాకిస్థాన్‌ ల మధ్య జరిగిన యుద్ధంలో భారత వాయుసేన పోషించిన పాత్ర ఆమోఘమని ఆయన కొనియాడారు.అయితే యుద్ద విమానాల సరఫరాలో జరుగుతున్న జాప్యంపై వాయుసేన చీఫ్‌ చేసిన వ్యాఖ్యలను కేంద్ర ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోవాలన్నారు.వాయుసేన చీఫ్‌ ఏ.పి.సింగ్‌ చేసిన వ్యాఖ్యలను మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి ఉటంకిస్తూ వాయుసేనకు ప్రతి సంవత్సరం 35 నుండి 40 వరకు ఫైటర్‌ జెట్లు అవసరం ఉండగా ఒప్పందం ప్రకారం హెచ్‌.ఏ.ఎల్‌ 24 ఫైటర్‌ జెట్లు సరఫరా చేయాల్సి ఉండగా అవి కుడా సరఫరా చేయడంలో హేచ్‌. ఏ.ఎల్‌ వైఫల్యం చెందిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.అదే సమయంలో భారత వాయుసేనలో ప్రతిభాపాటవాలను పునఃసమీక్షించాలని ఆయన సూచించారు.ఇండియా-పాకిస్థాన్‌ ల మధ్యన జరిగిన యుద్ధం తాలూక వివరాలను భారత ప్రభుత్వం పారదర్శకంగా ప్రజల ముందుంచాలని ఆయన డిమాండ్‌ చేశారు.తాజాగా జరిగిన యుద్ద పోరు సరిహద్దు ప్రాంతలలోనే జరిగినప్పుటికీ భారతదేశం ఫైటర్‌ విమానాలను కొల్పయిందన్నారు. ఇది మన సాంకేతిక సామర్ధ్యాలపై సమగ్రమైన సమీక్ష జరుపుకోవాల్సిన ఆవశ్యకతను తెలియ పరుస్తుందన్నారు.అదే సమయంలో హిందూస్థాన్‌ ఏరోనాటిక్స్‌ లిమిటెడ్‌ తేజస్‌ మార్క్‌-1ఏ ఫైటర్‌ జెట్లను సమయానుకూలంగా సరఫరా చేయడంలో విఫలమైందని ఆయన పేర్కొన్నారు.ఒక్కోసారి ఈ సమస్య జఠిలంగా మారవచ్చు అని ఆయన చెప్పారు. ఇదే పరిస్థితి పై భారత వాయుసేన చీఫ్‌ స్వయంగా వెలిబుచ్చిన అసంతృప్తిని భారత ప్రభుత్వం తీవ్రంగా పరిగణనలోకి తీసుకోవాలని ఆయన ఉద్బోధించారు.భారత్‌-పాక్‌ మధ్యన ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకున్నప్పుడు త్రివిధదళాలు సాహసోపేతంగా ప్రతిస్పందించాయని అయితే అదే సమయంలో త్రివిధ దళాలను మరింత బలోపేతం చేయడానికి భారత ప్రభుత్వం చొరవ చూపాలన్నారు.తాను పూర్వాశ్రమంలో నేషనల్‌ డిఫెన్స్‌ అకాడమీ గ్రాడ్యుయేట్‌ గా భారత వాయుసేన లో చేరి యం.ఐ జి -21 ,యం.ఐ. జి 23 లు నడిపిన పైలెట్‌ నని ఆయన గుర్తుచేశారు.కాలక్రమంలో రాజకీయాలలో చేరి వరుసగా ఆరు సార్లు శాసనసభ్యుడిగా ఒక మారు పార్లమెంట్‌ సభ్యుడిగా ఎన్నికైన తాను పార్లమెంట్‌ సభ్యుడిగా ఉన్నప్పుడు లోకసభలో ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ,ఏ.ఐ. సి.సి నేత వేణుగోపాల్‌ లతో పాటు ప్రస్తుత తెలంగాణా ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి లతో కలసి పార్లమెంటరీ డిఫెన్స్‌ కమిటీ సభ్యుడిగా పని చేసిన అనుభవాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు.భారత్‌-పాకిస్థాన్‌ ల మధ్య జరిగిన ఆపరేషన్‌ లో పాకిస్థాన్‌ లోని తొమ్మిది ఉగ్రవాద స్థావరాలపై జరిగిన దాడిని ఆయన కొనియాడారు. ఇందుకు కాంగ్రెస్‌ పార్టీ గర్వపడుతుందన్నారు.అయితే అదే సమయంలో త్రివిధ దళాల్లో పది శాతాన్ని మించి మానవ వనరులు మృగ్యమైన విషయంపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు.కోవిడ్‌-19 సమయంలో నియామకాలు మంద కోడిగా సాగుతున్నాయని,సరిహద్దుల్లో ముప్పు పొంచి ఉన్నందున మానవ వనరుల సంఖ్యను పెంపొందించేందుకు ప్రభుత్వం అన్ని రకాలుగా చర్యలు తీసుకోవాలన్నారు.