కాంగ్రెస్‌, యూపీఏలే తెలంగాణకు అడ్డంకి తేలిపోయింది.: హరీశ్‌రావు

హైదరాబాద్‌: రాజ్యసభలో చర్చ ద్వారా కాంగ్రెస్‌, యూపీఏ తెలంగాణకు అడ్డంకి తేలిందని తెరాస ఎమ్మెల్యే హరీశ్‌రావు అన్నారు. తెలంగాణపై కాంగ్రెస్‌కు చిత్తశుద్ధి ఉంటే రాజ్యసభలో సమాధానం చెప్పివుండేదని, తెలంగాణలో కాంగ్రెస్‌  పార్టీని భూస్థాపితం చేస్తామని ఆయన అన్నారు. తెలంగాణ కాంగ్రెస్‌ ప్రజాప్రతినిధులు ఆ  పార్టీలో ఉండాలో బయటకు రావాలో తేల్చుకోవాలని హరీశ్‌రావు అన్నారు.