తెలుగు వైభవం ప్రపంచ నలుమూలల చాటండి

– మన భాష ప్రక్రియలన్నింటినీ ప్రదర్శించండి

– సీఎం కేసీఆర్‌ దిశానిర్దేశం

హైదరాబాద్‌,నవంబర్‌ 15,(జనంసాక్షి):తెలంగాణలో వెలుగొందిన తెలుగు వైభవం, ప్రశస్తిని ప్రపంచానికి ఎలుగెత్తి చాటేలా ప్రపంచ తెలుగు మహాసభలు నిర్వహించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ రావు చెప్పారు. మహాసభల్లో తెలుగు భాషా ప్రక్రియలన్నింటికీ సంబంధించిన ప్రదర్శనలు జరగాలన్నారు. దేశ నలుమూలల నుంచే కాకుండా, ప్రపంచ నలుమూలల నుంచి తెలుగు భాషా పండితులు, తెలుగు సంఘాల ప్రతినిధులు, కవులు, రచయితలు, ప్రముఖులు మహాసభల్లో పాల్గొంటారని, వారికి అవసరమైన ఏర్పాట్లు చేయాలని సిఎం సూచించారు. వచ్చే నెలలో హైదరాబాద్‌ లో జరిగే ప్రపంచ తెలుగు మహాసభల ఏర్పాట్లపై హైదరాబాద్‌ లోని ప్రగతి భవన్లో బుధవారం సిఎం కేసీఆర్‌ సవిూక్ష నిర్వహించారు.”పద్యసాహిత్యం, గద్య సాహిత్యం, అవధానం, జానపదం, సంకీర్తనా సాహిత్యం, కథాకథన రూపాలు తదితర అంశాల్లో ఉద్దండులైన ఎంతో మంది తెలంగాణ బిడ్డలు తెలుగు భాషాభివృద్దికి, తెలుగు భాష వైభవానికి కృషి చేశారు. వారందరినీ స్మరించుకోవాలి. వారు తెలుగు భాష కోసం చేసిన కృషిని చాటి చెప్పాలి. తెలంగాణలో వెలుగొందిన భాషా ప్రక్రియలన్నింటినీ మరోసారి ప్రపంచానికి చూపాలి. వందల ఏళ్ల నుంచి తెలంగాణలో తెలుగు భాష వర్ధిల్లుతూ వస్తున్నది., అనేక మంది పండితులు, కవులు, రచయితలే కాకుండా నిరక్షరాస్యులు కూడా బతుకమ్మ లాంటి పాటల ద్వారా, జానపద పరంపరను కొనసాగించారు. ఈ గొప్ప చరిత్రను ఘనంగా చాటుకునేందుకు తెలుగు మహాసభలు ఉపయోగపడాలి. మహాసభల సందర్భంగా తెలుగు భాషలోని అన్ని ప్రక్రియలకు సంబంధించి ప్రత్యేక వేదిక ద్వారా ప్రదర్శనలు నిర్వహించాలి. ప్రతీ రోజు సాయంత్రం ఎల్‌.బి. స్టేడియంలో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాలి” అని సిఎం కేసీఆర్‌ దిశానిర్దేశం చేశారు.”ప్రపంచ వ్యాప్తంగా చాలా దేశాల్లో తెలుగు సంఘాలున్నాయి. దేశంలోని చాలా రాష్ట్రాల్లో తెలుగు మాట్లాడే ప్రజలు, సంఘాలున్నాయి. దేశ, విదేశాల్లో పరిపాలన, రాజకీయాలతో పాటు.. చాలా రంగాల్లో ఉన్నత స్థితికి చేరుకున్న తెలుగు వారున్నారు. వారందరినీ తెలంగాణలో జరిగే మహాసభలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రత్యేకంగా ఆహ్వానించాలి. అమెరికాతో సహా తెలుగు వారు ఎక్కువున్న దేశాల్లో, ఆంధ్రప్రదేశ్‌ తో సహా తెలుగువారున్న రాష్ట్రాలలో సన్నాహక సమావేశాలు నిర్వహించి ఆహ్వానించాలి” అని ముఖ్యమంత్రి సూచించారు.”మహాసభల సందర్భంగా హైదరాబాద్‌ నగరంలో విస్తృత ఏర్పాట్లు చేయాలి. స్వాగత తోరణాలు ఏర్పాటు చేయాలి. తెలుగు భాషలో పద్యాలు, పాటలు, వివిధ ప్రక్రియలకు సంబంధించిన ఆడియోలు ప్రతీ చోట వినిపించాలి. ప్రతీ ప్రక్రియ ప్రదర్శనకు వేర్వేరు వేదికలు ఏర్పాటు చేయాలి. ఎక్కడేం జరుగుతుందో అందరికీ తెలియడానికి విస్తృత ప్రచారం కల్పించాలి. ఎయిర్‌ పోర్టు, రైల్వే స్టేషన్లు, బస్‌ స్టేషన్లలో రిసెప్షన్‌ కౌంటర్‌ లు ఏర్పాటు చేయాలి. విదేశాలు, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన ప్రతినిధులకు బస, రవాణా, భోజన సదుపాయాలు కల్పించాలి. సాహిత్య అకాడవిూ ఆధ్వర్యంలో అన్ని ప్రభుత్వ శాఖలు, జిహెచ్‌ఎంసి, హెచ్‌ఎండిఎ, హెచ్‌.ఎం.డబ్ల్యు.ఎస్‌.ఎస్‌.బి. పూర్తి సమన్వయంతో పనిచేయాలి. పాఠశాలలు, కళాశాలల్లో పనిచేస్తున్న భాషా పండితులను ఆన్‌ డ్యూటీ విూద సభలకు ఆహ్వానించి, బాధ్యతలు అప్పగించాలి” అని ముఖ్యమంత్రి చెప్పారు.ఈ సమావేశంలో ప్రభుత్వ సలహాదారు కేవీ రమణాచారి, సాహిత్య అకాడవిూ చైర్మన్‌ నందిని సిధారెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌.పి.సింగ్‌, ముఖ్య కార్యదర్శి ఎస్‌.నర్సింగ్‌ రావు, తెలుగు యూనివర్సిటీ వైస్‌ ఛాన్సలర్‌ సత్యనారాయణ, సాంస్కృతిక శాఖ ముఖ్య కార్యదర్శి బుర్ర వెంకటేశం, మున్సిపల్‌ శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్‌ మిట్టల్‌, సాంస్కృతిక శాఖ డైరెక్టర్‌ మామిడి హరికృష్ణ, సిఎం ఓఎస్డి దేశపతి శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.v