పార్లమెంట్‌లో కొనసాగుతున్న విపక్షాల ఆందోళన

న్యూఢిల్లీ: బొగ్గు కుంభకోణంపై పార్లమెంట్‌లో విపక్షల ఆందోళన కొనసాగుతోంది. సోమవారం లోక్‌సభ ప్రారంభం కాగానే బొగ్గు కేటాయింపుల వ్యవహారంలో ప్రధాని నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయాలని విపక్ష సభ్యులు డిమాండ్‌ వ్యక్తం చేశారు. సభ్యులు తమ పట్టును వీడకపోవడంతో సభను స్పీకర్‌ మీరాకుమార్‌ మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా వేశారు. మరోవైపు ఇదే అంశంపై అటు రాజ్యసభ కూడా వాయిదా పడింది.