హస్తకళల అభివృద్ధికి లేపాక్షి కృషి: జస్టిన్ఘోష్
హైదరాబాద్: రాష్ట్రంలో హస్తకళల అభివృద్ధికి లేపాక్షి తరహా కేంద్రాలు ఎంతగానో కృషి చేస్తున్నాయని హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిన్ పినాకినీ చంద్రఘోష్ అన్నారు. హైదరాబాద్ గన్ఫౌండ్రీలో ఉన్న లేపాక్షి హస్తకళల కేంద్రాన్ని శనివారం ఆయన సందర్శించారు. అక్కడ ఉన్న కళాఖండాలను పరిశీలించారు. లేపాక్షిలో ఉన్న ప్రతి కళాఖండంపై చేతివృత్తిదారుల పనితీరు కనిపిస్తోందని ఈ సందర్భంగా ఘోష్ అన్నారు.