అంగన్వాడి ఉద్యోగుల 18వ రోజు సమ్మె సందర్భంగా నల్ల బ్యాడ్జీలతో నిరసన

జనం సాక్షి దుబ్బాక
సిద్దిపేట జిల్లా దుబ్బాకలో నల్ల బ్యాడ్జీలతో నిరసన చేశారు.అనంతరం అంగన్ వాడి యూనియన్ జిల్లాకోశాధికారి.జి.పద్మా మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడి ఉద్యోగులతో చర్చలు జరిపి డిమాండ్లు నెరవేర్చాలని కోరుతే రాష్ట్ర ప్రభుత్వం, అధికారులు బెదిరింపులకు పాల్పడడం దుర్మార్గం అన్నారు. గతంలో అంగన్వాడీలతో పెట్టుకున్న ప్రభుత్వాలు తిరిగి మనుగడ సాధించలేదని గుర్తు చేశారు.న్యాయంగా పోరాడుతున్న మా సమస్యలు వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు.మా యొక్క న్యాయమైన డిమాండ్లను పరిష్కరించే వరకు సమ్మె కొనసాగుతుందని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.రాష్ట్ర ప్రభుత్వం స్పందించకుండా మొండిగా వ్యవహరించడం సరైనది కాదని విమర్శించారు.అంగన్వాడి ఉద్యోగులు ప్రభుత్వాలకు ఇటు ప్రజలకు వారధిగా ఉంటూ అనేక రకాల సేవలు అందిస్తున్నారని తెలిపారు కానీ రాష్ట్ర ప్రభుత్వం కనీస వేతనాలు అమలు చేయకుండా అంగన్వాడి ఉద్యోగులచే వెట్టిచాకిరి చేయించుకుంటుందని మండిపడ్డారు రాష్ట్ర ప్రభుత్వo అంగన్వాడీ ఉద్యోగులకు కనీస వేతనం 26 వేల రూపాయలు ,రిటైర్మెంట్ బెనిఫిట్ ఆయాకు ఐదు లక్షలు టీచర్ కు 10 లక్షలు ఇవ్వాలని, అంగన్వాడి ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగుల గుర్తించాలని ,రిటైర్ అనంతరం వేతనంలో సగం పెన్షన్ ఇవ్వాలని సుప్రీంకోర్టు తీర్పును అమలు చేసి సమస్యలు వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు లేనియెడల ఈ సమ్మెను మరింత ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో అంగన్వాడి యూనియన్ జిల్లా కోశాధికారి పద్మ ,విజయ, నాగరాణి, సురేఖ,పద్మలత, మంజుల,స్వరూప,బాబయ్,లక్ష్మి ,రమ,పుష్ప,తదితరులు పాల్గొన్నారు.