అంగన్వాడీ సెంటర్ లో ఘనంగా రక్షభందన్ వేడుకలు

గరిడేపల్లి, ఆగస్టు 12 (జనం సాక్షి): అన్నా చెల్లెళ్ళు అక్కా తమ్ముళ్లు అనుబంధానికి ఆప్యాయతలకు నిదర్శనం రక్షాబంధన్ అని అంగన్వాడీ టీచర్ పోకల వెంకమ్మ అన్నారు.మండలంలోని గానుగబండ అంగన్వాడీ కేంద్రంలో రక్షాబంధన్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ భారతదేశ సంస్కృతి సంప్రదాయలను  కాపాడుకోవాల్సిన ఆచరించాల్సిన బాధ్యత మనపై ఉన్నదన్నారు.  అంగన్వాడీ పిల్లలు ఒకరికి ఒకరు రాఖీలను కట్టి శుభాకాంక్షలు తెలుపుకొని  స్వీట్స్ పంచుకున్నారు.ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు పిల్లలు, పిల్లల తల్లితండ్రులు పాల్గొన్నారు.